Asian Games: క్రికెట్లో మేం గోల్డ్ సాధించాం.. ఇక మీ వంతు: జెమీమా రోడ్రిగ్స్
ఆసియా క్రీడల్లో (Asian Games) స్వర్ణ పతకం గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో లంకను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెటర్లు (Womens Cricket Team) అద్భుతం చేశారు. ఆసియా క్రీడల్లో (Asian Games) స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఫైనల్లో శ్రీలంకను(INDw vs SLw) కట్టడి చేసి విజయం సాధించారు. ఈ టోర్నీలో జెమీమా రోడ్రిగ్స్ టాప్ స్కోరర్. ఆమె మూడు మ్యాచుల్లో 109 పరుగులు చేసింది. ఫైనల్లోనూ 42 పరుగులతో ఆకట్టుకుంది. గోల్డ్ మెడల్ అందుకున్న తర్వాత జెమీమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత పురుషుల జట్టుకూ ఓ సందేశం ఇచ్చింది. ‘‘ ఇక మనం పురుషుల క్రికెట్ జట్టు గురించి మాట్లాడుకుందాం. వారికి ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడు మేం స్వర్ణం గెలిచాం. ఇక మీ వంతు. మీరు కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలి’’ అని పేర్కొంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 116 పరుగులే చేయగలిగింది. అయితే, తితాస్ సాదు అద్భుతమైన బౌలింగ్తో శ్రీలంకను కేవలం 97 పరుగులకే కట్టడి చేసి 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇలా క్రీడా సమరంలో ఛాంపియన్గా నిలవడంపై జెమీమా రోడ్రిగ్స్ ఆనందం వ్యక్తం చేసింది.
‘‘పోడియంపై భారత జాతీయ జెండా సగర్వంగా ఎగరడం ఆనందంగా ఉంది. ఇలాంటి అనుభూతి అద్భుతం. బంగారు పతకం గెలవడం స్పెషల్. తొలిసారి భారత మహిళా క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం చరిత్రలో నిలిచిపోతుంది. ఆసియా క్రీడల్లో భారత జెర్సీని ధరించి బరిలోకి దిగడం భిన్నమైన అనుభవం. మేం కూడా ఒక మెడల్ను దేశం కోసం సాధించామని చెప్పడం బాగుంది. ఫైనల్లో శ్రీలంక మాకు గట్టి పోటీనిచ్చింది. అయితే, మా బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీస్తూ వారిపై ఒత్తిడి పెంచారు. బ్యాటింగ్లో మంధానతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉంది. ఇక్కడకు రాకముందు పిచ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడి గెలవాలనే లక్ష్యంతోనే ముందుకు సాగాం’’ అని జెమీమా వ్యాఖ్యానించింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని పురుషుల జట్టు అక్టోబర్ 3న నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Australia: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
ప్రపంచకప్లో తొలుత ఎదురైన ఓటముల నుంచి ఎలా బయటపడ్డామనే రహస్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ బయటపెట్టాడు. కేవలం ఒక్క మీటింగ్ జట్టు ఆటతీరును మార్చేసిందన్నాడు. -
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు. -
India vs Australia: సిరీస్పై భారత్ కన్ను
ప్రపంచకప్ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడుతూ తొలి రెండు టీ20ల్లో అదరగొట్టిన టీమ్ఇండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలన్నదే లక్ష్యం. -
Hardik Pandya: వారసుడు ఇతనేనా?
అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్రౌండర్ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది. -
గుజరాత్ కెప్టెన్గా శుభ్మన్
గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమితుడయ్యాడు. ఈ టీమ్ఇండియా యువ సంచలనం వచ్చే ఏడాది ఐపీఎల్లో టైటాన్స్ను నడిపించనున్నాడు. -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
విజయ్ హజారె ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ నిలువరించింది. -
బంగ్లా - కివీస్ తొలి టెస్టు నేటి నుంచే
సొంతగడ్డపై న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో తలపడేందుకు బంగ్లాదేశ్ సై అంటోంది. మంగళవారం నుంచే తొలి టెస్టు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023- 2025 చక్రంలో ఈ రెండు జట్లకిదే తొలి మ్యాచ్. -
ముంబయితో ఎన్నో జ్ఞాపకాలు
ముంబయి ఇండియన్స్ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, తిరిగి జట్టుతో చేరడం బాగుందని హార్దిక్ తెలిపాడు. 2015లో ముంబయితోనే ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన అతను.. -
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali) తన మనసులోని మాటను బయటపెట్టాడు.


తాజా వార్తలు (Latest News)
-
Kriti Sanon: అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
-
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
-
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు
-
Animal: అసలు రన్ టైమ్ 3 గంటల 21నిమిషాలు కాదు.. తెలిస్తే షాకే!
-
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!