కోహ్లీని అలా చేయడం ఇంగ్లాండ్కు బోనస్..!
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్ చేయడం ఇంగ్లాండ్కు బోనస్ అని ఆ జట్టు ఫాస్ట్బౌలర్ జోఫ్రాఆర్చర్ అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్ చేయడం ఇంగ్లాండ్కు బోనస్ అని ఆ జట్టు ఫాస్ట్బౌలర్ జోఫ్రాఆర్చర్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా ఓటమిపాలవ్వగా, విరాట్ కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. కాగా, అంతకుముందు జరిగిన నాలుగో టెస్టులోనూ అతడు పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. దీంతో వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో డకౌటయ్యాడు. మరోవైపు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ విరాట్ ఇలాగే పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ ఇటీవలి కాలంలో పెద్ద స్కోర్లు సాధించకుండా త్వరగా ఔటైపోతున్నాడు.
ఈ క్రమంలోనే తొలి టీ20 అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్చర్ ‘మా ప్రణాళికలు కచ్చితంగా అమలవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రషీద్ ప్రపంచ శ్రేణి బౌలర్. ఎక్కడైనా బౌలింగ్ చేయగల సమర్థుడు. కోహ్లీ ప్రమాదకర బ్యాట్స్మన్ అనే విషయం తెలిసిందే. అయితే, అతడిని పదేపదే తక్కువ స్కోరుకు పరిమితం చేయడం ఇంగ్లాండ్ జట్టుకు నిజమైన బోనస్. ఇది కచ్చితంగా టీమ్ఇండియాను నిరుత్సాహపరిచి ఉండొచ్చు. అలాగే మా జట్టు విజయంలో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రత్యర్థులు బలంగా ఉంటే నాలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. నాకు ఒక వికెట్ దక్కినా.. మూడు వికెట్లు దక్కినా నా బౌలింగ్లో ఏమాత్రం మార్పు ఉండదు’ అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ఆర్చర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 23/3 ప్రదర్శన చేశాడు. అందులో కీలకమైన కేఎల్ రాహుల్(1), హార్దిక్ పాండ్య(19), శార్ధూల్ ఠాకుర్(0) వికెట్లు తీశాడు. ఇక అదిల్ రషీద్ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 124/7 స్కోరుకు పరిమితమైంది. ఆపై ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి