Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు
తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను (T20 world cup 2007) ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని భారత్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. పాక్పై ఫైనల్లో (IND vs PAK) పోరాడి మరీ విజయం సాధించింది. ఈ విజయంలో జోగిందర్ శర్మ (Joginder Sharma) కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. తొలిసారి జరుగుతున్న పొట్టి వరల్డ్కప్ మరి అది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్కు చేరిన టీమ్ఇండియా కప్ను సొంతం చేసుకొంది. తుది పోరులో పాకిస్థాన్ను ఐదు పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మీడియం పేసర్ జోగిందర్ శర్మ (Joginder Sharma) అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడెందుకు అంటారా..? తొలి టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించిన ఈ హీరో అంతర్జాతీయతోపాటు దేశవాళీ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. 2004లో జాతీయ జట్టులోకి వచ్చిన జోగిందర్ టీమ్ఇండియా తరఫున కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20లను మాత్రమే ఆడాడు. పొట్టి కప్ ఫైనల్ మ్యాచే అతడి చివరి టీ20 కావడం గమనార్హం. 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచుల్లో పాల్గొన్నాడు. ప్రపంచకప్లో రాణించినప్పటికీ.. జాతీయ జట్టు తరఫున పెద్దగా అవకాశాలు రాలేదు. 2007లోనే హరియాణా పోలీస్ శాఖలో జాయిన్ అయిన జోగిందర్.. 2020నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్గా ఎదిగాడు.
ఈ క్రమంలో అన్ని విభాగాల క్రికెట్కు వీడ్కోలు చెబుతూ జోగిందర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ‘‘కృతజ్ఞతాభావం, గర్వంతో ఇవాళ నేను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా. 2002 నుంచి 2007 వరకు సాగిన క్రికెట్ ప్రయాణం నా జీవితంలో మరుపురాని అనుభవాలను మిగిల్చింది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఇలా అవకాశం కల్పించిన బీసీసీఐ, హరియాణా క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, హరియాణా ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కోచింగ్ సేవలు, నాతో ఆడిన సహచరులు, మెంటార్స్, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటా. కలను నిజం చేసుకోవడానికి పూర్తి సహాయ సహకారాలను అందించిన అభిమానులకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. క్రికెటర్గా, పోలీస్ ఆఫీసర్గా ఎదగడంలో కీలకంగా వ్యవహరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు’’ అని సందేశం పెట్టాడు.
ఫైనల్లో అప్పుడు అలా..
టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ మ్యాచ్లో.. తొలుత భారత్ బ్యాటింగ్లో 157/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 19 ఓవర్లకు 145/9 స్కోరు చేసింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే స్టార్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ క్రీజ్లో ఉన్నాడు. అయితే కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ మాత్రం బంతిని జోగిందర్ చేతికి ఇచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తొలి బంతిని వైడ్గా వేసిన జోగిందర్.. రెండో బంతికి సిక్స్ ఇచ్చాడు. దీంతో పాక్ విజయ సమీకరణ నాలుగు బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. భారత అభిమానుల్లో కంగారు మొదలైంది. మరో భారీ షాట్ కొడితే విజయం పాక్దే అవుతుందని ఆందోళన చెందారు. కానీ, జోగిందర్ వేసిన బంతిని స్కూప్ చేయబోయిన మిస్బా ఫైన్లెగ్ వైపు షాట్ కొట్టాడు. అక్కడే కాచుకొని ఉన్న శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ను ఒడిసిపట్టడం.. పాక్ 152 పరుగులకే ఆలౌట్ కావడంతో తొలి టైటిల్ టీమ్ఇండియా ఖాతాలో పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ