IPL 2021 : ఆ ముగ్గురు ఐపీఎల్కు దూరం..!
మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 మిగతా సీజన్కి పలువురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో..
(Photo: IPL Twitter)
ఇంటర్నెట్ డెస్కు : మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 మిగతా సీజన్కి పలువురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్, దిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా మిగతా సీజన్కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘ఐపీఎల్-2021 మిగతా సీజన్లో డేవిడ్ మలన్ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ వెంట వెంటనే ఉండటంతో.. అతడు తన కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ అడెన్ మార్క్రమ్ ఆడనున్నాడు’ అని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది.
భారత జట్టు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో ఐదు టెస్టుల సిరీస్లో చివరి టెస్టు మ్యాచ్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లను ఆయా జట్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దుబాయి తరలిస్తున్నాయి. దుబాయిలో ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం ఆటగాళ్లు తమ జట్టు సభ్యులతో చేరనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా