T20 World Cup: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో 9 మంది.. భారత ఆటగాడికేనన్న బట్లర్!
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఆటగాడికిచ్చే అవార్డు.. అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీలో ఆసాంతం అదరగొట్టిన ప్లేయర్కు దక్కే పురస్కారం. ఆదివారం ఫైనల్ మ్యాచ్ అనంతరం ఐసీసీ ప్రకటిస్తుంది. అయితే రేసులో నిలిచిన తొమ్మిది మందితో కూడిన లిస్ట్ను ఐసీసీ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదివారమే టీ20 ప్రపంచకప్ ఫైనల్. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లలో టైటిల్ విజేతను తేల్చే పోరు. ప్రతి మ్యాచ్ తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇస్తారు కదా.. అలాగే ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందజేస్తారు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన బ్యాటర్/బౌలర్కు ఇది దక్కుతుంది. మరి టైటిల్ దక్కించుకొనేది ఎవరో ఆ రెండు జట్లు తేల్చుకుంటాయి. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ ఎవరిదో తెలియాలంటే కూడా ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే తొమ్మిది మందితో కూడిన జాబితాను ఐసీసీ విడుదల చేసింది. మరి ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లు ఎవరు..? ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఎవరిని ఎంపిక చేసుకొన్నాడో కూడా తెలుసుకుందాం..
ఐసీసీ జాబితాలో టీమ్ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, పాకిస్థాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్, ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా, శ్రీలంక ఆల్రౌండర్ వహిందు హసరంగ ఉన్నారు. టాప్ స్కోరర్గా విరాట్ కోహ్లీ (6 మ్యాచుల్లో 296 పరుగులు) ఉన్నాడు. అయితే ఈ లిస్ట్లో పేరున్నప్పటికీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం టీమ్ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్నే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు ఎంపిక చేసుకోవడం విశేషం. సూర్యకుమార్ 239 పరుగులతో ఈ పొట్టికప్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో ఆటగాడు.
‘‘నేను సూర్యకుమార్ యాదవ్ను ఎంచుకుంటా. ఎందుకంటే ఈ టోర్నీలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టిన బ్యాటర్ అతడే. స్టార్ బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆ జట్టులో అతడి ఆటను చూసేందుకు ఎదురు చూడటం అద్భుతంగా ఉంది. సూర్య బ్యాటింగ్ ప్రదర్శన సూపర్. అలాగే మా జట్టు నుంచి ఆల్రౌండర్ సామ్ కరన్, అలెక్స్ హేల్స్కు అవకాశం ఉంది. ఫైనల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే వారిద్దరిలో ఎవరికైనా అవార్డు దక్కే ఛాన్స్ ఉంది’’ అని బట్లర్ వెల్లడించాడు. మరోవైపు ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు పోటీదారుల్లో ముందుంటాడని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!