Sanju Samson కెప్టెన్గా ఎదుగుతున్నాడు!
కెప్టెన్సీ అనేది సంజూ శాంసన్ నేర్చుకునే గొప్ప అనుభవమని, అందులో అతడు మెరుగవుతున్నాడని ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ అన్నాడు. తాజాగా రాజస్థాన్ టీమ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బట్లర్...
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్
ఇంటర్నెట్డెస్క్: కెప్టెన్సీ అనేది సంజూ శాంసన్ నేర్చుకునే గొప్ప అనుభవమని, అందులో అతడు మెరుగవుతున్నాడని ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా రాజస్థాన్ టీమ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘కెప్టెన్సీ అనేది సంజూ నేర్చుకోవడానికి గొప్ప అనుభవంలా పనికొస్తుంది. టోర్నీ జరిగేకొద్దీ అతడా బాధ్యతల్లో మెరుగవుతున్నాడు. ఒక జట్టుగా టోర్నీ పూర్తయ్యేసరికి నిలకడైన ప్రదర్శనతో సమష్టిగా రాణించాలనుకున్నాడు. నేను అతడి సారథ్యంలో బాగా ఆస్వాదించాను’ అని బట్లర్ పేర్కొన్నాడు.
ఒక వ్యక్తిగా కెప్టెన్సీ సంజూని మార్చలేదని, అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడని రాజస్థాన్ ఓపెనర్ వివరించాడు. అలాగే తమ జట్టును కూడా తీర్చిదిద్దాలనుకున్నట్లు చెప్పాడు. తమ నుంచి సంజూ అదే ఆశించాడన్నాడు. ఒక కెప్టెన్గా అలా కచ్చితమైన అభిప్రాయంతో ఉండటం చాలా ముఖ్యమని, ఆ విషయంలో సంజూ అలాగే ఉన్నాడని తెలిపాడు. అనంతరం రాజస్థాన్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతడో ప్రత్యేకమైన ఆటగాడని, రాజస్థాన్ జట్టులోనే కాకుండా భవిష్యత్లో టీమ్ఇండియాకు సైతం అత్యుత్తమ సేవలు అందిస్తాడన్నాడు. అందుకోసం పరాగ్ను జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అతడికి మెరుగైన శిక్షణ అందించాలన్నాడు.
కాగా, గతేడాది ఐపీఎల్లో రాజస్థాన్కు కెప్టెన్సీ చేసిన స్టీవ్స్మిత్ సరైన ఫలితాలు సాధించకపోవడంతో ఈసారి ఆ జట్టు అతడిని వదిలేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సీజన్కు ముందు రాజస్థాన్ సంజూను కొత్త సారథిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9న ప్రారంభమైన 14వ సీజన్లో అతడు తొలిసారి కెప్టెన్సీ చేపట్టాడు. ఇక సగం సీజన్ పూర్తయ్యేసరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. అప్పటికే రాజస్థాన్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు టోర్నీ తిరిగి ప్రారంభమైనప్పుడు సంజూ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న