నేను వాటిని విడిచిపెట్టను: జస్టిన్ లాంగర్
తనపై వచ్చిన విమర్శల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టనని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ఇటీవల ఆ జట్టు టీమ్ఇండియా చేతిలో ఘోర పరాభవం పాలయ్యాక కోచ్తో ఆసీస్ ఆటగాళ్లకు...
ఇంటర్నెట్డెస్క్: తనపై వచ్చిన విమర్శల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టబోనని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ఇటీవల ఆ జట్టు టీమ్ఇండియా చేతిలో ఘోర పరాభవం పాలయ్యాక కోచ్తో ఆసీస్ ఆటగాళ్లకు పొసగడం లేదని అక్కడి మీడియాలో కథనం వచ్చింది. లాంగర్ కోచింగ్ శైలి బాగోలేదంటూ పలువురు సీనియర్ ఆటగాళ్లే అసంతృప్తితో ఉన్నారని దాని సారాంశం. తొలుత వాటిని ఖండించిన లాంగర్ ఇప్పుడు తన తప్పులను సరిచేసుకుంటానని అన్నాడు.
‘ఇప్పుడా విమర్శలను విడిచిపెట్టను. అవి నాకు మేలుకొలుపు లాంటివి. వాటిని గొప్ప బహుమతిగా భావిస్తా. ఎప్పుడైతే కోచింగ్ కెరీర్ను వదులుకుంటానో అప్పుడు.. నన్ను నేను కొత్త కోచ్గానే పరిగణించుకుంటా. నా జీవితంలో మార్గనిర్దేశకులు ఎవరైనా ఉన్నారంటే నా గురించి నిజాలు చెప్పేవాళ్లే. నాకు అలాంటి వాస్తవమైన అభిప్రాయాలే కావాలి. ఆ సమయంలో అవి నాకు నచ్చకపోయినా, అవెంతో ముఖ్యం’ అని లాంగర్ పేర్కొన్నాడు.
నా గురించి జట్టులో ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలిసింది. నేనేంటో మీకు తెలుసు. చాలా సాధారణంగా ఉంటా. ఈ విమర్శలని సానుకూలంగా తీసుకుంటా. వాటి మీద దృష్టిసారిస్తా. అయితే, కొన్నిసార్లు కఠినంగా ఉంటా. నేను అత్యుత్తమ కోచ్ కాకపోయినా కొన్నింటిలో బాగానే పనిచేస్తా. ఈ అంశంపై ఆటగాళ్లు నేరుగా వచ్చి నాతో మాట్లాడొచ్చు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకుందాం’ అని ఆసీస్ కోచ్ వివరించాడు.
ఇవీ చదవండి..
ఫీల్డింగ్ చేస్తూ జెర్సీ మార్పు.. బంతి బౌండరీకి
రిషభ్ పంత్ గుండెపోటు తెప్పించగలడు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!