World Cup 2003: భారత్తో మ్యాచ్లో రజాక్పై అక్రమ్ తీవ్ర ఆగ్రహం.. ఎందుకో చెప్పిన కైఫ్
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సమరం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక...
నాటి సంఘటనను గుర్తు చేసుకున్న టీమ్ఇండియా మాజీ ఆటగాడు
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సమరం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేవు. కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో (వన్డే, టీ20) ఒకే ఒక్కసారి మాత్రమే భారత్పై పాక్ గెలిచింది. మిగతా అన్నిసార్లూ టీమ్ఇండియాదే ఆధిపత్యం. 2003 ప్రపంచకప్లో భారత్-పాక్ ఫైట్ను ఎవరూ మరిచిపోలేరు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అద్భుతమైన ఫామ్తో భారత్ను ఫైనల్కు చేర్చాడు. అయితే తుదిపోరులో ఆసీస్పై ఓటమిపాలైనప్పటికీ భారత క్రికెట్ చరిత్రలో అదొక సువర్ణధ్యాయమే. ఈ క్రమంలో పాక్తో జరిగిన పోరును మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ గుర్తు చేసుకున్నాడు. ఓ క్రీడా ఛానల్తో షోయబ్ అక్తర్తో కలిసి కైఫ్ మాట్లాడాడు.
అబ్దుల్ రజాక్పై వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనను మహమ్మద్ కైఫ్ వివరించాడు. ధాటిగా ఆడుతున్న సచిన్ క్యాచ్ను అబ్దుల్ రజాక్ వదిలేశాడు. దీంతో వసీం అక్రమ్ ఒక్కసారిగా రజాక్పై కోప్పడ్డాడు. అసలు అప్పుడేమైందనేదానిని కైఫ్ వివరించాడు. ‘‘భారత్-పాక్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అప్పుడు జరిగిన మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఒకవేళ సచిన్ క్యాచ్ను మిడ్-ఆఫ్లో రజాక్ పట్టి ఉంటే మ్యాచ్ ఇంకా రసవత్తరంగా మారేది. నాకు ఇప్పటికీ గుర్తు.. ఆ రోజు రజాక్పై వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అయితే రజాక్ మిడ్-ఆఫ్లో కాకుండా బౌలర్కు కాస్త పక్కగా నిలబడటంతో క్యాచ్ను అందుకోలేకపోయాడు’’ అని కైఫ్ తెలిపాడు. సచిన్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడని, అతడికి కేవలం మద్దతుగా నిలవడానికి మాత్రమే క్రీజ్లో ఉన్నట్లు కైఫ్ పేర్కొన్నాడు. ‘‘నీతో భాగస్వామ్యం నిర్మించేందుకే ఉన్నానని సచిన్తో చెప్పా. ఎటాకింగ్ మొదలుపెడితే నేను స్ట్రైక్ను రొటేట్ మాత్రమే చేశా. ఆ పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నా’’ అని వివరించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 273/7 స్కోరు సాధించింది. సయీద్ అన్వర్ (101) శతకం సాధించాడు. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు శుభారంభమే దక్కింది. సచిన్-వీరేంద్ర సెహ్వాగ్ (21) జోడీ అర్ధశతక (53) భాగస్వామ్యం జోడించారు. అయితే సెహ్వాగ్తోపాటు గంగూలీ (0) వెనువెంటనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన మహమ్మద్ కైఫ్ (35)తో కలిసి సచిన్ 102 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అయితే సచిన్ 98 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. ఇక ఆఖర్లో రాహుల్ ద్రవిడ్ (44*), యువరాజ్ సింగ్ (50*) పాకిస్థాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 45.4 ఓవర్లలోనే ముగించేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!