Team India: ఒకేసారి మూడు జట్లతో ఆడగలదు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ భారత క్రికెట్ ఆలోచనా ద్రుక్పథాన్ని ప్రశంసించాడు. టెస్టు క్రికెట్కు టీమ్ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పాడు. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నాడు...
ధోనీ తప్ప మిగతా దిగ్గజాలంతా అలానే చేశారు : అక్మల్
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ భారత క్రికెట్ ఆలోచనా దృక్పథాన్ని ప్రశంసించాడు. టెస్టు క్రికెట్కు టీమ్ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పాడు. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘టెస్టు క్రికెట్ విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడలేదు. పాఠశాల స్థాయిలోనే అక్కడ రెండు, మూడు రోజుల ఆటలు నిర్వహిస్తారు. దాంతో వారికి బలమైన పునాది పడుతుంది. అలాగే టీమ్ఇండియా సంప్రదాయ క్రికెట్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్లే ఇప్పుడు 50 మంది ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్నారు. దాంతో వాళ్లు ఒకేసారి మూడు జట్లతో తలపడే సామర్థ్యం ఉంది. భారత క్రికెట్లో ధోనీ మినహా మిగతా దిగ్గజాలందరూ తమ చివరి మ్యాచ్ను టెస్టుల్లోనే ముగించారు. దీన్ని బట్టే వాళ్లు ఆ ఆటకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో అర్థం చేసుకోవచ్చు’ అక్మల్ చెప్పుకొచ్చాడు.
అలాగే భారత క్రికెట్లో లిస్ట్-ఏ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడకముందే 40-50 మ్యాచ్లు ఆడి ఉంటారని, దాంతో వారికి తగినంత అనుభవం ఉంటుందని పాక్ మాజీ బ్యాట్స్మన్ వివరించాడు. వారు టీమ్ఇండియాకు ఎంపికయ్యేసరికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటారన్నాడు. అందుకు సూర్యకుమార్ యాదవే సరైన ఉదాహరణగా పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టు ఆలోచనా విధానం మెచ్చుకోదగినదని, దిగ్గజ ఆటగాళ్లు.. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్కుంబ్లే లాంటి వారు ఏదో ఒక రూపంలో సేవలందిస్తున్నారని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా ఇప్పుడు 50 మంది ఆటగాళ్లతో సిద్ధంగా ఉందన్నాడు. త్వరలో జరిగే శ్రీలంక పర్యటనలోనూ భారత యువ ఆటగాళ్లే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, టీమ్ఇండియా ప్రధాన ఆటగాళ్లు జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉండనుండగా.. ధావన్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా లాంటి ద్వితీయశ్రేణి ఆటగాళ్లు లంక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే అక్మల్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా