WTC Final: కోహ్లీ కౌగిలిలో వినమ్రంగా కేన్.. వైరల్
ఒక చిత్రం వెయ్యి మాటల పెట్టు! నోటితో చెప్పలేని ఎన్నో మాటలను.. చూపులతో వ్యక్తీకరించలేని ఎన్నో భావోద్వేగాలను ఒక చిత్రం స్పష్టంగా చూపించగలదు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిశాక విరాట్ కోహ్లీ.. కేన్ విలియమ్సన్ను హత్తుకోవడం ఇలాంటిదే...
వాహ్.. ఏం చిత్రమిది! అంటూ కామెంట్స్
ఒక చిత్రం వెయ్యి మాటల పెట్టు! నోటితో చెప్పలేని ఎన్నో మాటలను.. చూపులతో వ్యక్తీకరించలేని ఎన్నో భావోద్వేగాలను ఒక చిత్రం స్పష్టంగా చూపించగలదు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిశాక విరాట్ కోహ్లీ.. కేన్ విలియమ్సన్ను హత్తుకోవడం ఇలాంటిదే. ఓటమి బాధలో ఉన్న విరాట్ కౌగిలిలో కేన్ స్నేహపూర్వకంగా విన్రమంగా ఒదిగిపోయాడు. ఆ అద్భుత క్షణంలో బంధించిన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ అండర్-19 నుంచి మంచి స్నేహితులు. వేర్వేరు జట్లకు ఆడుతున్నా.. ప్రత్యర్థులుగా మైదానంలో తలపడుతున్నా.. వారి మిత్రబంధం మాత్రం మరింత బలపడుతూనే ఉంది. పరస్పరం గౌరవించుకోవడం.. మాట్లాడుకోవడం.. ముచ్చట్లు చెపుతూ నవ్వుకోవడం.. అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాంటి చిత్రాలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజా చిత్రం మాత్రం అంతకు మించే అనాలి. ఇద్దరూ కొన్నేళ్లుగా సొంత జట్లకు సారథ్యం వహిస్తున్నారు. ఆరంభంలో కాస్త ఇబ్బందులున్నా క్రమంగా జట్లపై బలమైన ముద్ర వేశారు. కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటేందుకే ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథులే అయినా ఐసీసీ టోర్నీల్లో ఆఖరి మెట్లపై బోల్తా పడటం వారికో ఇబ్బందిగా మారింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీసేన ఫైనల్లో పాక్ చేతిలో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది. అటు కివీస్ సైతం ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ మినహాయిస్తే వారి స్థాయికి తగిన టైటిల్ మాత్రం కొట్టేలేదు. 2015, 2019 ప్రపంచకప్ ఫైనళ్లలో ఓటమి పాలైంది.
అందుకే ఈ ఇద్దరు సారథులకు ఐసీసీ ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కీలకంగా మారింది. వర్షం వల్ల వాతావరణం బాగా లేకపోవడంతో చివరి రోజు వరకు ఫైనల్ డ్రా అవుతుందనే అనుకున్నారు. కానీ, రిజర్వు డే అయిన మంగళవారం మాత్రం అనూహ్యం జరిగింది. కోహ్లీసేనను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్గా అవతరించింది. ఇద్దరికీ దక్కుతుందనుకున్న ఐసీసీ గద విలియమ్సన్ భుజాలపైకి చేరింది. అలాంటి క్షణాల్లో కోహ్లీ కౌగిలిలో వినమ్రతతో ఒదిగిపోయిన కేన్ చిత్రం వైరల్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ