WTC Final: ఒక్క మ్యాచ్తో తక్కువ చేయొద్దు!
ఫైనల్ మ్యాచ్ ఒక్కటే ఉండటం ఎంతో ఉత్సాహం కలిగిస్తుందని, కానీ.. భారత జట్టు ఎంత బలమైనదో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్ సరిపోదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు...
ఈ టీమ్ఇండియా చాలా బలమైంది: విలియమ్సన్
ఇంటర్నెట్డెస్క్: ఫైనల్ మ్యాచ్ ఒక్కటే ఉండటం ఎంతో ఉత్సాహం కలిగిస్తుందని, కానీ.. భారత జట్టు ఎంత బలమైనదో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్ సరిపోదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గతవారం జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన విలియమ్సన్ టీమ్ఇండియాను పొగడ్తలతో ముంచెత్తాడు.
‘ఈ టీమ్ఇండియా చాలా బలమైన జట్టు. ఎదురులేనిది కూడా. అలాంటి జట్టుపై విజయం సాధించడం మాకు గర్వంగా ఉన్నా. వాళ్ల శక్తి, సామర్థ్యాలు ఏ పాటివో అందరికీ తెలిసిందే. వాళ్లింకా ఇలాంటివి ఎన్నో విజయాలు సాధిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్లెంత మంచి ఆటగాళ్లో తెలుసు. వాళ్లకున్న పేస్ బౌలింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమైంది. అలాగే స్పిన్ బౌలర్లు కూడా అత్యద్భుతంగా బంతులేస్తారు. ఇక బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్యాకప్ ఆటగాళ్లను కూడా అద్భుతంగా తయారు చేసుకున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా క్రికెట్కు తమని తాము బ్రాండ్ అంబాసిడర్లుగా అనుకుంటారు’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ చివరి రోజు ఫలితం అటు ఇటుగా మూడు విధాలుగా ఉందని, సమయాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారని కివీస్ సారథి చెప్పాడు. ఆరో రోజు(రిజర్వ్డే) ఫలితం ఎలా అయినా ఉండొచ్చని తాము ముందే ఊహించామన్నాడు. అయితే, శక్తిమేరకు పోరాడాలని నిర్ణయించుకున్నట్లు విలియమ్సన్ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్ ద్వారా పరిస్థితులు ఎలా మారుతాయో తెలిసొచ్చిందని అన్నాడు. మరోవైపు కోహ్లీ, పుజారాను త్వరగా ఔట్ చేయడం వల్లే తమకు కలిసి వచ్చిందని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.