Suresh Raina: రైనా దేవుడిలా నా జీవితంలోకి వచ్చాడు: కార్తీక్ త్యాగి
చెన్నై మాజీ ప్లేయర్ సురేశ్ రైనా దేవుడిలా తన జీవితంలోకి వచ్చాడని హైదరాబాద్ యువ పేసర్ కార్తీక్ త్యాగీ అన్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్తో వెలుగులోకి వచ్చిన ఈ ఉత్తర్ ప్రదేశ్ కుర్రాడు అదే...
(Photos: Suresh Raina, Kartik Tyagi Instagram)
ఇంటర్నెట్డెస్క్: చెన్నై మాజీ ప్లేయర్ సురేశ్ రైనా దేవుడిలా తన జీవితంలోకి వచ్చాడని హైదరాబాద్ యువ పేసర్ కార్తీక్ త్యాగీ అన్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్తో వెలుగులోకి వచ్చిన ఈ ఉత్తర్ ప్రదేశ్ కుర్రాడు అదే ఏడాది టీ20 లీగ్లో రాజస్థాన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే ఆరంభ సీజన్లో 10 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి ఆకట్టుకున్న అతడు గతేడాది 4 మ్యాచ్లే ఆడి 4 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి మెగా వేలంలో హైదరాబాద్ టీమ్ రూ.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో రెండేళ్లలోనే అతడి జీవితం మారిపోయింది. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన కార్తీక్.. మాజీ క్రికెటర్ సురేశ్ రైనానే తన ఎదుగుదలకు కారణమని చెప్పాడు.
‘నేనెప్పుడూ ఒకే విషయం చెప్తా. రైనా నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు. అండర్-16 స్థాయిలో రంజీ జట్టుకు ఎంపికయ్యాకే నన్ను ప్రజలు గుర్తుపట్టడం మొదలెట్టారు. నేను 13 ఏళ్లు ఉండగా అండర్-14 స్థాయిలో క్రికెట్ ఆడటం ప్రారంభించా. అక్కడే నా కెరీర్ మొదలైంది. తర్వాత అండర్-16లో ఒక సీజన్లో ఏడు మ్యాచ్ల్లో 50 వికెట్లు తీశాను. దాంతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాను. అప్పుడు నేను అద్భుతంగా రాణించినా ఫైనల్స్లో మేం గెలవలేకపోయాం. కానీ, అప్పుడే కోచ్ జ్ఞానేంద్ర పాండే నా బౌలింగ్ను మెచ్చుకొని ఇకపై నన్ను ప్రోత్సహిస్తానని చెప్పారు. అక్కడి నుంచి రాష్ట్ర రంజీ జట్టుకు ఎంపికయ్యా. ఆ జట్టులో చేరినప్పుడు నా వయసు 16 ఏళ్లే. మిగతావాళ్లంతా ఎప్పటినుంచో ఆడుతున్నారు. అదే సమయంలో ఒకసారి రైనాతో పరిచయం అయింది’ అని చెప్పుకొచ్చాడు.
‘రంజీ జట్టులో నేను చాలా సైలెంట్గా ఉంటూ అన్ని విషయాలూ గమనించేవాడిని. ఒకసారి మేం ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడికి రైనా వచ్చాడు. అతను వెళ్లేముందు నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. నువ్వేం చేస్తావని అడిగితే బౌలర్ అని చెప్పా. దాంతో నన్ను నెట్స్లో తనకు బౌలింగ్ చేయమని కోరాడు. నా బౌలింగ్కు మెచ్చిన రైనా.. భవిష్యత్లో నాకు మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. అంత గొప్ప ఆటగాడు నా బౌలింగ్ను మెచ్చుకోవడంతో తొలుత నేను నమ్మలేకపోయా. జోక్ చేస్తున్నాడనుకున్నా. తర్వాత నా పేరు సీనియర్ రంజీ టీమ్కు ఎంపికయ్యాక షాకయ్యా. అక్కడి నుంచే నా రంజీ కెరీర్ మొదలైంది. అక్కడ రాణించి అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యా’ అని కార్తీక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?