KBC: నా హాకీ ప్యాడ్స్ కోసం ఆవును అమ్మేశారు: హాకీ గోల్కీపర్ శ్రీజేష్
ప్రతిష్ఠాత్మక క్విజ్షో, అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి’ సీజన్-13లో ఇటీవల టోక్యో ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శిరీష్ పాల్గొన్నారు. సాధారణ క్విజ్షోలా ప్రశ్నలు జవాబులు అడగకుండా వారి జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాల, కష్టసుఖాల గురించి చెప్పమనగానే.. హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ భావోద్వేగానికి లోనై.. ‘‘నేను జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్కి ఎంపికైనప్పుడు..
ముంబయి: ప్రతిష్టాత్మక క్విజ్షో, అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి’ సీజన్-13లో ఇటీవల టోక్యో ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శిరీష్ పాల్గొన్నారు. సాధారణ క్విజ్షోలా ప్రశ్నలు జవాబులు అడగకుండా వారి జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాల, కష్టసుఖాల గురించి చెప్పమన్నారు. దీనికి హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ భావోద్వేగానికిలోనై తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.
‘‘నేను జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్కి ఎంపికైనప్పుడు.. ‘నువ్వు క్రీడలవైపు వెళ్లాలనుకుంటున్నావ్? నీకు అక్కడ స్థిరమైన ఉద్యోగం దొరుకుతుందా?’ అని నాన్న ప్రశ్నించారు. ‘నేనేంటో నిరూపించుకోవడానికి మూడేళ్ల సమయం ఇవ్వండి నాన్న. ఈలోపు నేను కనుక ఫెయిల్ అయితే మళ్లీ నా రూట్ మార్చుకుంటా’ అని మాటిచ్చా. ఆ ఒప్పందంతో నేను హాకీ ఆడటం మొదలుపెట్టా. అలా గోల్కీపర్గా రంగప్రవేశం చేశా.
గోల్కీపింగ్ గురించి మీకో విషయం చెప్పాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత వెచ్చించే డబ్బు మా దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే మాదో సాధారణ రైతు కుటుంబం. హాకీ పాడ్స్ కొనేంత ఆర్థిక పరిస్థితి లేదు. ఓ రోజు మా నాన్నను ప్యాడ్స్ కోసం డబ్బులు కావాలని అడిగా. ఆయన శక్తి మేరకు ఎలాగైనా పంపించేలా ప్రయత్నం చేశారు. అలా ఆయన అన్నట్టే ప్యాడ్స్ కొనిచ్చారు. నాన్న ఎలా కొనిచ్చారని అమ్మను అడగగానే కేవలం నా పాడ్స్ కోసమని నాన్న మా కుటుంబానికి జీవనాధారణమైన ఆవును అమ్మేశారని తెలిసింది’’ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
‘‘నేను ఎప్పుడైనా నిరుత్సాహానికి గురైనప్పుడు లేదా ఈ క్రీడలెందుకు వదిలేద్దామా అని ఆలోచనవచ్చినప్పుడు ఆరోజు మా నాన్న నాకోసం చేసిన త్యాగాన్ని గుర్తుతెచ్చుకుంటా. తన బిడ్డ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడని ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని, అలాగే జీవనాధారమైన ఆవుని అమ్మేసి నాకోసం చేసిన రిస్క్ని గుర్తుచేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేష్.. కాంస్యం పతకాన్ని తన తండ్రికి అంకితమించినట్లు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
Gujarat vs Delhi: పంత్ వికెట్ కీపింగ్ అదుర్స్.. ఒంటి చేత్తో సూపర్ క్యాచ్
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వికెట్ కీపింగ్తో అదరగొట్టాడు. ఇషాంత్ శర్మ వేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి వికెట్ కీపర్ పంత్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ వెనుదిరిగాడు.
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. -
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్కు శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. -
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్