Rohit Sharma: తన కెప్టెన్సీ విజయ రహస్యం చెప్పిన రోహిత్ శర్మ
భారత టీ20 లీగ్లో ముంబయి జట్టును విజయవంతంగా నడిపించాడు రోహిత్ శర్మ. ఆ జట్టు ఏకంగా ఐదు టైటిళ్లతో టాప్లో ఉంది. దీంతో రోహిత్ నాయకత్వంపై మాజీలు, క్రికెట్ పండితులు........
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్లో ముంబయి జట్టును విజయవంతంగా నడిపించాడు రోహిత్ శర్మ. ఆ జట్టు ఏకంగా ఐదు టైటిళ్లతో టాప్లో ఉంది. దీంతో రోహిత్ నాయకత్వంపై మాజీలు, క్రికెట్ పండితులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా, టీమ్ఇండియా అన్ని ఫార్మాట్లకు ఇప్పుడు రోహిత్ సారథ్యం వహిస్తూ.. జట్లను ముందుండి నడిపిస్తూ విజయ తీరాలకు చేరుస్తున్నాడు. కాగా తన కెప్టెన్సీ శైలి గురించి హిట్మ్యాన్ మాట్లాడాడు. పరిస్థితులను క్లిష్టంగా చూడబోనని, విషయాలను చాలా సరళంగా ఉంచేందుకే ప్రయత్నిస్తానని.. అదే తన కెప్టెన్సీ విజయ రహస్యమని చెప్పుకొచ్చాడు.
ఓ క్రీడా ఛానెల్లో ‘ఫాలో ది బ్ల్యూస్’ అనే కార్యక్రమంలో రోహిత్ తన నాయకత్వం గురించి మాట్లాడాడు. ‘విషయాలను చాలా తేలిగ్గా, సరళంగా ఉంచుతాను. వాటిని క్లిష్టతరం చేయను. ముంబయిని నడిపిస్తూ ఇదే చేశాను. ఇప్పుడు టీమ్ఇండియాలోనూ ఆ సూత్రాన్నే కొనసాగిస్తున్నా. జట్టు సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిస్తా. టీమ్లో ఎవరి బాధ్యతలను వారికి అర్థమయ్యేలా చెప్పి, వారి నుంచి జట్టు ఏం ఆశిస్తుందో వారికి క్లియర్గా తెలియజేస్తా. ఈ విషయంలో నేను, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాలను చాలా సులభంగా, సరళంగా తెలియజేస్తా’ అని పేర్కొన్నాడు.
తన నాయకత్వం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. ఏ ఆటగాడైనా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు అసలు సమస్య ఏంటో అతడికి స్పష్టంగా తెలిజేస్తానని చెప్పాడు. తిరిగి ఫాం అందుకోవాలంటే అతడు ఏ అంశంపై దృష్టి పెట్టాలలో సైతం క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. ‘పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి బలాలు బలహీనతలు చెప్పి.. ఒక్కో ప్లేయర్ నుంచి టీం ఏం ఆశిస్తుందో తెలియజేయాలి. దానిపై దృష్టిసారించేలా ప్రోత్సహించాలి. అలాంటి సమయంలోనే ఆటగాడు వ్యక్తిగతంగా రాణించగలడు. కెప్టెన్గా నేను దీనిపై ఎక్కవగా దృష్టిపెడతా’ అని రోహిత్ వెల్లడించాడు.
అది కూడా మామూలు మ్యాచే
ఆసియా కప్లో పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో దాయాది పోరును ఎలా చూస్తారనే దానికి రోహిత్ శర్మ స్పందించాడు. ‘‘పాకిస్థాన్తో మ్యాచ్ అంటే అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది. ఒత్తిడి కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎంత నియంత్రించుకున్నా అదుపు చేయలేం. అందుకే ఇలాంటి మ్యాచ్ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటాం. ఇతర టీమ్లతో ఆడినట్లే పాక్తోనూ ఆడతాం. మేం కేవలం ఆట మీదనే దృష్టిపెడతాం’’ అని వివరించాడు. ఆసియా కప్లో భారత్-పాక్ ఆగస్ట్ 28న ఢీకొంటాయి. అయితే పాక్ పేసర్ షహీన్ అఫ్రిదీ గాయం కారణంగా ఆసియా కప్ నుంచి వైదొలిగినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే