
Published : 12 Aug 2021 01:35 IST
sreejesh: భారత హాకీ గోల్కీపర్ శ్రీజేష్కు భారీ నజరానా
కేరళ: భారత హాకీ జట్టు గోల్కీపర్ శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం పోరులో కీలకంగా వ్యవహరించి అద్భత ప్రదర్శన చేసినందుకు శ్రీజేష్కు రూ.2 కోట్ల ప్రోత్సాహాన్ని ప్రకటించింది. అంతేకాకుండా విద్యాశాఖలో జాయింట్ డైరక్టర్గా నియమిస్తున్నట్లు తెలిపింది. కాంస్యం పోరులో భారత్, జర్మనీ ఇరుజట్లు గెలుపు కోసం భీకరంగా పోరాడాయి. ఈ మ్యాచ్లో భారత్ 5-4 తేడాతో జర్మనీ జట్టును ఓడించింది. దీంతో 41 ఏళ్ల తర్వాత హాకీ జట్టు ఒలింపిక్స్ పోటీల్లో పతకాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో జర్మనీ జట్టు గోల్పోస్ట్ వద్ద పదేపదే దాడులు చేసినప్పటికీ గోల్కీపర్ శ్రీజేష్ అసమాన పోరాటపటిమను చూపి అడ్డుగోడగా నిలిచాడు.
ఇవీ చదవండి
Tags :