Ravindra Jadeaja: ధోనీలాగే జడేజా.. మంచి నిర్ణయాలు తీసుకుంటాడు: పీటర్సన్
చెన్నై జట్టు కెప్టెన్గా ఇటీవలే నియమితుడైన రవీంద్ర జడేజా.. ధోనీలాగే ప్రశాంతమైన ఆటగాడని, అతడు కూడా మాజీ సారథిలాగే జట్టును నడిపిస్తాడని ఇంగ్లాండ్...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై జట్టు కెప్టెన్గా ఇటీవలే నియమితుడైన రవీంద్ర జడేజా.. ధోనీలాగే ప్రశాంతమైన ఆటగాడని, అతడు కూడా మాజీ సారథిలాగే జట్టును నడిపిస్తాడని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో చురుగ్గా ఉంటాడని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడాడు. అలాగే ధోనీ.. జడేజాను కెప్టెన్గా ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. తాజాగా ఓ వెబ్సైట్కు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ధోనీ తప్పుకొనేందుకు ఇదే సరైన సమయం అని ఆ జట్టు భావించి ఉండొచ్చు. అయితే, అతడు జడేజాను ఎంచుకోవడం నన్నేమి ఆశ్చర్యానికి గురిచేయలేదు. జడ్డూ చాలా గొప్ప ఆటగాడు మాత్రమే కాదు. తెలివైన క్రికెటర్ కూడా. టీ20ల్లో ఎంతో అనుభవం ఉన్న ఆల్రౌండర్. ధోనీలా ప్రశాంతంగా ఆలోచిస్తాడు. దీంతో ఈసారి కూడా ఆ జట్టు మిగతా జట్లను ఓడించి.. ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. గతేడాది కూడా ఆ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేసింది. అప్పుడు నేను కూడా ఆ జట్టును తక్కువగా చూశా. ఇప్పుడు ఆ జట్టులో యువరక్తం పారుతోంది. ఆ జట్టులో సరైన నిర్ణయాలు తీసుకునే మేటి క్రికెట్ బుర్రలు ఉన్నాయి. దీంతో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించగలమనే నమ్మకంతో ఉన్నారు. సహజంగా టీ20 క్రికెట్లో పరిస్థితులకు తగ్గట్టు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యర్థుల కంటే ఎవరు మంచి నిర్ణయాలు తీసుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.