IPL: మిగిలిన మ్యాచ్లు ఇంగ్లాండ్లో ఆడించాలి
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్లో టీమ్ఇండియా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ పూర్తవగానే...
సెప్టెంబర్లో నిర్వహించాలని పీటర్సన్ కోరిక..
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్లో టీమ్ఇండియా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ పూర్తవగానే వీలైనంత త్వరగా మిగతా సీజన్ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు యూఏఈనే అనువైన వేదికగా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై కచ్చితమైన సమాచారం లేకపోయినా గతేడాది అక్కడే ఈ టోర్నీని దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ మాత్రం మిగిలిన ఐపీఎల్ సీజన్ను ఇంగ్లాండ్లో నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా సంస్థకు రాసిన కథనంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ‘సెప్టెంబర్లో యూఏఈలో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని, అందుకు అదే సరైన వేదికని పలువురు మాట్లాడుకుంటుండటం నేను గమనించాను. అయితే, నేను మాత్రం ఆ మెగా ఈవెంట్ను ఇంగ్లాండ్కు తరలించాలని అనుకుంటున్నాను. సెప్టెంబర్లో టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల ఐదు టెస్టుల సిరీస్ తర్వాత కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లంతా అక్కడే ఉంటారు. దాంతో అది సరైన వేదిక’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఆ కాలంలో ఇంగ్లాండ్లోని వాతావరణం అద్భుతంగా ఉంటుందని, దాంతో లండన్ సహా మాంచెస్టర్, బర్మింగ్హామ్, లీడ్స్ వేదికలుగా మ్యాచ్లు నిర్వహించొచ్చని చెప్పాడు. అలాగే అక్కడ మ్యాచ్లు చూసేందుకు ప్రజలకు అనుమతిస్తారని అన్నాడు. దాంతో ఐపీఎల్కు కొత్త ఉత్సాహం వస్తుందన్నాడు. మరోవైపు ఈ మెగా ఈవెంట్ను ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికా దేశాల్లో నిర్వహించారని, అలాంటప్పుడు ఈసారి ఇంగ్లాండే సరైన వేదికని పీటర్సన్ వివరించాడు. కాగా.. ఇంతకుముందే మిడిల్సెక్స్, సుర్రే, వార్విక్షైర్, లాంకషైర్ లాంటి కౌంటీ క్రికెట్ క్లబ్లు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడానికి ఆసక్తిచూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీటర్సన్ అవే మాటలనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా