T20 League : 10 జట్లు.. 2 గ్రూప్లు.. 14 మ్యాచ్లు.. లెక్క ఇదీ!
ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న 15వ సీజన్...
గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న దేశవాళీ టీ20 లీగ్ వివరాలు వచ్చేశాయి. కొవిడ్ నేపథ్యంలో విమాన ప్రయాణాల్ని నివారించేలా రెండు నగరాల్లోని నాలుగు మైదానాల్లోనే జరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు నిన్న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ వివరాలను ప్రకటించింది. మార్చి 26న ప్రారంభమవుతుంది. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్ల తేదీలు, ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనే వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మొత్తం ఎన్ని మ్యాచ్లు..?
ఈసారి పది జట్లు తలపడబోయే టోర్నీలో 70 లీగ్ మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. ఛాంపియన్షిప్ను ఏ జట్టు ఎన్నిసార్లు గెలుచుకుంది, ఏ జట్టు ఎన్నిసార్లు ఫైనల్కు చేరుకుందనే వివరాలను దృష్టిలో పెట్టుకుని పది జట్లను రెండు వర్చువల్ గ్రూప్లుగా విభజించారు. ప్రతి జట్టూ 14 లీగ్ మ్యాచ్లను ఆడాలి. ఏడు సొంత మైదానంలో, మరో ఏడు బయట స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్లను వాంఖడే, డీవై పాటిల్ మైదానాల్లోనూ.. మూడేసి మ్యాచ్లను సీసీఐ (ముంబయి), ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియాల్లో (పుణె) ఆడాలి. వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్లు, సీసీఐ మైదానంలో 15, డీవై పాటిల్ స్టేడియంలో 20, పుణె ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్లు జరుగుతాయి. ఒక్కో జట్టుకు సొంతమైదానం ఏదనేది నిర్ణయించాల్సి ఉంది.
ఏ జట్టు ఏ గ్రూప్లో...?
పది జట్లను వాటి ప్రదర్శన ఆధారంగా రెండు గ్రూప్లుగా విభజించింది. గ్రూప్-Aలో ముంబయి, కోల్కతా, రాజస్థాన్, దిల్లీ, లఖ్నవూ ఉన్నాయి. ఇక గ్రూప్-Bలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లకు స్థానం దక్కింది. ప్రతి జట్టు తమ గ్రూప్లోని టీమ్తో రెండేసి మ్యాచ్లను ఆడాలి. ఇక రెండో గ్రూప్లోని ఓ జట్టుతో రెండు మ్యాచ్లు, మిగతా టీమ్స్తో ఒక్కో మ్యాచ్ను ఆడాల్సి ఉంటుంది.
* ఉదాహరణకు.. హైదరాబాద్ను తీసుకుంటే.. ఈ జట్టు గ్రూప్-బిలో ఉంది. ఇక్కడ ఉన్న చెన్నై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్తో రెండేసి మ్యాచ్లను ఆడుతుంది. గ్రూప్-ఏలోని కోల్కతాతో రెండు మ్యాచ్లు.. ముంబయి, రాజస్థాన్, దిల్లీ, లఖ్నవూతో ఒక్కో మ్యాచ్ను ఆడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో