Kieron Pollard : కీరన్ పొలార్డ్.. టీ20ల్లో అరుదైన ఘనత
వెస్డిండీస్ క్రికెట్లో ఠక్కున గుర్తుకొచ్చే క్రికెటర్లు క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్.. వీరిద్దరూ భారత టీ20 లీగ్లోనూ ప్రాతినిధ్యం వహించడం.. భారీ షాట్లు...
ఇంటర్నెట్ డెస్క్: వెస్డిండీస్ క్రికెట్లో ఠక్కున గుర్తుకొచ్చే క్రికెటర్లు క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్.. వీరిద్దరూ భారత టీ20 లీగ్లోనూ ప్రాతినిధ్యం వహించడం.. భారీ షాట్లు కొట్టగల ప్రతిభావంతులు కావడంతో అందరికీ చేరువయ్యారు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏకంగా 600 టీ20 మ్యాచ్లను ఆడిన తొలి క్రికెటర్గా అవతరించాడు. పొలార్డ్ ఇప్పుడేమీ విండీస్ జట్టులో లేడు కదా.. మరి ఎలా సాధించాడని అనుకుంటున్నారా..? ఈ మాజీ సారథి అంతర్జాతీయ క్రికెట్కు మాత్రమే వీడ్కోలు పలికాడు. దేశీయ క్రికెట్ లీగుల్లో ఇంకా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ‘హండ్రెడ్ టోర్నమెంట్’లో లండన్ స్పిరిట్స్ జట్టుకు పొలార్డ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్తో జరిగిన మ్యాచ్ పొలార్డ్కు 600వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఇందులో అంతర్జాతీయంగా 101 టీ20లు ఉన్నాయి.
ఇప్పటివరకు పొలార్డ్ ఆడిన 600 టీ20ల్లో 151.22 స్ట్రైక్రేట్తో 11,723 పరుగులను సాధించాడు. 31.34 యావరేజ్తో ఆడిన పొలార్డ్ కేవలం ఒకే శతకం, 56 అర్ధశతకాలను నమోదు చేశాడు. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 104. మొత్తం 783 సిక్సర్లు, 738 ఫోర్లను బాదాడు. ఇక 8.21 ఎకానమీతో 309 వికెట్లను తీయడం విశేషం. బౌలింగ్ అత్యుత్తమ ప్రదర్శన 4/15. ఇందులో ఏడుసార్లు నాలుగు వికెట్ల కంటే ఎక్కువసార్లు తీశాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో, భారత టీ20 లీగ్లో ముంబయి జట్టు, బిగ్బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, ఢాకా గ్లాడియేటర్స్, ఢాకా డైనమైట్స్, కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మీ, ట్రిన్బాగో నైట్ రైడర్స్ తదితర దేశీయ లీగుల్లో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ క్రికెట్లో పొలార్డ్ తర్వాత అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్లలో డ్వేన్ బ్రావో (543), షోయబ్ మాలిక్ (472), క్రిస్ గేల్ (463), రవి బొపారా (426) ఉన్నారు. పొలార్డ్ 600 టీ20లు ఆడటంపై టీమ్ఇండియా స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. అద్భుతమైన మైలురాయిని సాధించిన పొలార్డ్కు శుభాకాంక్షలు అంటూ.. ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు