Gary Kirsten : ఇంగ్లాండ్ కోచ్గా గ్యారీ కిర్స్టెన్.!
టీమ్ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.! ఇటీవల యాషెస్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఘోర పరాజయం పాలు కావడంతో.. ప్రస్తుత...
(Photo : Kirsten Twitter)
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.! ఇటీవల యాషెస్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఘోర పరాజయం పాలవ్వడంతో ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో అతడిని కోచ్గా కొనసాగించడంపై సంధిగ్ధత నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్లో ఇంకా రెండు టెస్టులు మిగిలుండగానే ఆసీస్ 3-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
‘ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్గా పని చేయడం గొప్ప గౌరవం. అందుకే అవకాశం ఉన్న ప్రతిసారీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇంతకు ముందు 2015, 2019 సంవత్సరాల్లో కూడా నేను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే, అన్ని ఫార్మాట్లకు కోచ్గా కొనసాగలేనని యాజమాన్యానికి స్పష్టంగా చెప్పాను. అందుకేనేమో నన్ను పక్కన పెట్టారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్లో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లు ఉండాలనే కొత్త ట్రెండ్ మొదలైంది. అందుకే, కోచ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నాను. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది. అందుకే ఆ జట్టు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వన్డే జట్టు బలంగా కనిపిస్తోంది. టెస్టు జట్టును మాత్రం కొంచెం తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లతో టెస్టు జట్టును పటిష్టంగా తయారు చేయాలి’ అని గ్యారీ కిర్స్టెన్ అన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడైన గ్యారీ కిర్స్టెన్ 2008 నుంచి 2011 వరకు టీమ్ఇండియా హెడ్ కోచ్గా పని చేశాడు. ఇతడి నేతృత్వంలోనే భారత జట్టు 2009లో టెస్టుల్లో తొలిసారిగా అగ్రస్థానానికి చేరింది. 2011 వన్డే ప్రపంచకప్లో భారత జట్టును ఛాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2017 నుంచి 2019 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..