IPL: ‘నా స్కోరు కంటే జట్టు విజయమే ముఖ్యం’
శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో పంత్ సేన..7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు నిన్న తలపడ్డాయి. ఇందులో పంత్ సేన..7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. రసెల్ 45, గిల్ 43 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. 132 పరుగుల వద్ద దిల్లీ మొదటి వికెట్(ధావన్ 46) కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీ షా 82 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో స్టోయినిస్ దిల్లీకి విజయానందించాడు. ఈ మ్యాచ్పై ఎవరేమన్నారంటే..
‘‘ఈ మ్యాచ్ ఫలితం చాలా నిరాశకు గురిచేసింది. మేం చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాం. మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయాం. చివర్లో రసెల్ దూకుడుగా ఆడటంతో 150కి పైగా స్కోరు సాధించాం. పృథ్వీషా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మేం ఏమి చేయలేకపోయాం. ఇది మా జట్టులోని లోపాలను ఎత్తిచూపుతోంది. మేం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. కమిన్స్ కొత్త బంతితో చక్కగా బౌలింగ్ చేశాడు. శివమ్ మావి గత మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు విఫలమయ్యాడు. మనం తిరిగి రాణిస్తామని ఆశిద్దాం. మా జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ, మేం దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి’’
-ఇయాన్ మోర్గాన్, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్
‘‘అతడు(పృథ్వీ షా) అద్భుతమైన ఆటగాడని మనందరికి తెలుసు. అతని మీద నమ్మకం ఉంచితే అద్భుతాలు చేయగలడు. అతనికి సాధారణంగా ఆడాలని చెప్పాం. ఇటువంటి మ్యాచ్ల్లో రన్రేట్ గురించి ఆలోచిస్తాం. క్రికెట్ను ఆస్వాదిస్తూ..మీ శక్తి మేరకు పరుగులు చేయండి అని ఆటగాళ్లకు చెబుతుంటాం. లలిత్ యాదవ్ మంచి ఆల్రౌండర్. అతని బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, నేర్చుకుంటాడు. గత మ్యాచ్(బెంగళూరు)లో మేం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయాం. కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా’’
-రిషభ్ పంత్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
‘‘ధైర్యంగా ఆడాలని నిర్ణయించుకున్నా. చెత్త బంతుల కోసం వేచి చూశా. శివమ్ మావితో నాలుగైదేళ్లుగా ఆడుతున్నా. కాబట్టి, అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసు. మొదటి నాలుగు బంతులు పుల్ లెంగ్త్లో వచ్చాయి. తర్వాత షార్ట్ బాల్ ఆడేందుకు సన్నద్ధం అయ్యాను. కానీ, మావి వేయలేదు. ఈ పిచ్పై ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో బంతి బ్యాట్ పైకి కాస్త ఆలస్యంగా వస్తోంది. ఆఫ్ స్టంప్, అవుట్ సైడ్ బంతులు ఎక్కువగా రావడంతో స్వేచ్ఛగా ఆడగలిగా. నేనెప్పుడూ వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించను. జట్టు విజయమే నాకు ముఖ్యం. ఇప్పటి వరకు సెహ్వాగ్తో మాట్లాడే అవకాశం రాలేదు. అవకాశం వస్తే తప్పకుండా మాట్లాడతా. ఎందుకంటే సెహ్వాగ్కు కూడా తొలి బంతికి బౌండరీ కొట్టడం లేదా పరుగులు చేయడాన్ని ఇష్టపడతాడు.
-పృథ్వీ షా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే