KKR vs RCB: బెంగళూరుపై కోల్కతా సునాయాస విజయం
ఐపీఎల్-14 సీజన్ రెండో దశలో కోల్కతా నైట్రైడర్స్ శుభారంభం చేసింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఓపెనర్లు శుభమన్ గిల్ (48),వెంకటేశ్ అయ్యర్ (41)రాణించడంతో ఆర్సీబీ
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-14 సీజన్ రెండో దశలో కోల్కతా నైట్రైడర్స్ శుభారంభం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (48), వెంకటేశ్ అయ్యర్ (41)రాణించడంతో ఆర్సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా 9.6 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో కోల్కతా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి వచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా 18.6 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు ఆటగాళ్లలో ఓపెనర్ దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్. ఆర్సీబీకి రెండో ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 1.4 ఓవర్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ(5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వన్డౌన్ బ్యాట్స్మన్ శ్రీకర్ భరత్(16)తో కలిసి దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో చివరి బంతికి పడిక్కల్ దినేశ్ కార్తీక్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. రసెల్ వేసిన తొమ్మిదో ఓవర్లో భరత్(16), డివిలియర్స్(0) ఔటయ్యారు. ఈ క్రమంలో పది ఓవర్లకు ఆర్సీబీ 54/4తో నిలిచింది. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో మాక్స్వెల్(10), హసరంగ(0) పెవిలియన్ చేరారు. కైల్ జేమీసన్(4), సచిన్ బేబీ(7) కూడా నిరాశపర్చారు.హర్షల్ పటేల్(12) రెండు ఫోర్లు బాది ఫెర్గూసన్ వేసిన 16.3 ఓవర్కు క్లీన్ బౌల్డయ్యాడు.సిరాజ్(8)ని రసెల్ ఔట్ చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ మూడు వికెట్లతో రాణించారు.ఫెర్గూసన్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.