KL Rahul: మిడిలార్డర్లో ఆడేందుకు సిద్ధం కావాలన్నారు: కేఎల్ రాహుల్
రానున్న వన్డే మ్యాచ్ల్లో తనను మిడిలార్డర్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలంటూ టీమ్మేనేజ్మెంట్ అడిగిందని కేఎల్ రాహుల్(KL Rahul) తెలిపాడు.
దిల్లీ: బంగ్లాదేశ్(Bangladesh)తో వన్డే సిరీస్కు రిషభ్ పంత్(Rishabh pant) దూరమైన విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది సూచనల మేరకు అతడికి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ(BCCI) దీనిపై స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న వన్డేల్లో కేఎల్ రాహుల్(KL Rahul)కు మిడిలార్డర్, వికెట్ కీపర్ బాధ్యతలను అప్పగించేందుకు టీమ్మేనేజ్మెంట్ సిద్ధమైంది. ఈ విషయంపై రాహుల్ తాజాగా స్పందించాడు.
‘‘వన్డేల్లో వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలంటూ టీమ్మేనేజ్మెంట్ నన్ను అడిగింది. మేం గత 8-9 నెలల్లో ఈ ఫార్మాట్లో ఎక్కువగా ఆడలేదు. కానీ, 2020-21 మధ్య నేను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్కు దిగాను. అందుకే ఈ పాత్ర కోసం టీమ్మేనేజ్మెంట్ నన్ను సిద్ధంగా ఉండాలని కోరి ఉంటుంది’’ అని తెలిపాడు. పంత్ విషయంపై మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఈ సిరీస్కు దూరం కానున్నాడని ప్రకటించిన రోజే నాకూ తెలిసింది. అతడి విశ్రాంతికి గల కారణాలపై బీసీసీఐ వైద్య సిబ్బందే సరైన సమాధానం చెప్పగల్గుతారు’’అని తెలిపాడు.
బంగ్లాతో తొలి వన్డేలో రాహుల్ 73 పరుగులు చేసినప్పటికీ.. మెహదీ హసన్ క్యాచ్ను వదిలేయడంతో టీమ్ఇండియా ఓటమి బాట పట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు