KL Rahul: మిడిలార్డర్లో ఆడేందుకు సిద్ధం కావాలన్నారు: కేఎల్ రాహుల్
రానున్న వన్డే మ్యాచ్ల్లో తనను మిడిలార్డర్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలంటూ టీమ్మేనేజ్మెంట్ అడిగిందని కేఎల్ రాహుల్(KL Rahul) తెలిపాడు.
దిల్లీ: బంగ్లాదేశ్(Bangladesh)తో వన్డే సిరీస్కు రిషభ్ పంత్(Rishabh pant) దూరమైన విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది సూచనల మేరకు అతడికి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ(BCCI) దీనిపై స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న వన్డేల్లో కేఎల్ రాహుల్(KL Rahul)కు మిడిలార్డర్, వికెట్ కీపర్ బాధ్యతలను అప్పగించేందుకు టీమ్మేనేజ్మెంట్ సిద్ధమైంది. ఈ విషయంపై రాహుల్ తాజాగా స్పందించాడు.
‘‘వన్డేల్లో వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలంటూ టీమ్మేనేజ్మెంట్ నన్ను అడిగింది. మేం గత 8-9 నెలల్లో ఈ ఫార్మాట్లో ఎక్కువగా ఆడలేదు. కానీ, 2020-21 మధ్య నేను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్కు దిగాను. అందుకే ఈ పాత్ర కోసం టీమ్మేనేజ్మెంట్ నన్ను సిద్ధంగా ఉండాలని కోరి ఉంటుంది’’ అని తెలిపాడు. పంత్ విషయంపై మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఈ సిరీస్కు దూరం కానున్నాడని ప్రకటించిన రోజే నాకూ తెలిసింది. అతడి విశ్రాంతికి గల కారణాలపై బీసీసీఐ వైద్య సిబ్బందే సరైన సమాధానం చెప్పగల్గుతారు’’అని తెలిపాడు.
బంగ్లాతో తొలి వన్డేలో రాహుల్ 73 పరుగులు చేసినప్పటికీ.. మెహదీ హసన్ క్యాచ్ను వదిలేయడంతో టీమ్ఇండియా ఓటమి బాట పట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్