KL Rahul: సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావం నాపై తీవ్రంగా ఉంది: కేఎల్ రాహుల్
లఖ్నవూ రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం కారణంగా ఐపీఎల్ సీజన్లోని కీలక సమయంలో వైదొలిగాడు. కానీ, అతడి స్థానంలో కృనాల్ పాండ్య జట్టును నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన ట్రోలింగ్ను కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గత బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ నుంచి టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుత ఐపీఎల్లో 9 మ్యాచ్లను ఆడిన రాహుల్.. గాయం కారణంగా టోర్నీతోపాటు వచ్చేనెలలో జరిగే (జూన్ 7 నుంచి) ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కూ దూరమయ్యాడు. లఖ్నవూ సూపర్ జెయింట్స్ సారథ్య బాధ్యతలను కేఎల్ నుంచి కృనాల్ పాండ్య తీసుకున్నాడు. తాజాగా ముంబయిపై లఖ్నవూ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి అడుగు ముందుకేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. తనలాగే ఇతర క్రికెటర్లూ ప్రభావితులైన వారిలో ఉన్నారని పేర్కొన్నాడు. ఏ ఆటగాడు కూడానూ కావాలనే చెత్తగా ఆడరని, ఇదంతా జీవితంలో ఓ భాగమని చెప్పాడు.
‘‘సోషల్మీడియా ట్రోలింగ్ వల్ల నాతోపాటు ఇతర ప్లేయర్లపైనా ప్రభావం పడింది. ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లకు మద్దతు చాలా అవసరం. ఇలా ఇతరుల మీద కామెంట్ లేదా ట్రోలింగ్ చేయడాన్ని తమ హక్కుగా కొందరు భావిస్తారు. వారేం కామెంట్లు చేయాలని అనుకుంటారో అదే చేసేస్తారు. క్రికెటర్లు ఎవరూ కూడానూ కావాలని చెత్తగా ఆడాలని కోరుకోరు. ఇది మన జీవితం. నాకు క్రికెట్ కాకుండా మరొకటి తెలియదు. క్రికెట్ ఆడటం మాత్రమే నాకు తెలుసు. నేను సీరియస్గా లేనని, కష్టపడనని ప్రతి ఒక్కరూ ఎందుకు అనుకుంటారు? క్రీడల్లో మరీ దారుణంగా ప్లేయర్లను ట్రోల్స్ చేస్తారు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం మన వైపు లేకపోతే ఏం చేయలేం కదా’’ అని రాహుల్ తెలిపాడు.
ది మ్యాంగో గయ్.. నవీనుల్ హక్
ముంబయిపై విజయం సాధించడంతో లఖ్నవూ ఆటగాళ్లు జోష్ మీదున్నారు. ఈ సందర్భంగా సహచరుడు నవీనుల్ హక్తో కలిసి నికోలస్ పూరన్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్గా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత తమ బస్లో హోటల్ గదికి చేరుకునే క్రమంలో.. నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. నవీనుల్ను ‘ది మ్యాంగ్ గయ్’గా అభివర్ణించాడు. గతవారం ముంబయి - బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ (1) త్వరగా ఔట్ కావడంతో నవీనుల్ ‘స్వీట్ మ్యాంగోస్’ అంటూ ఇన్స్టాలో పోస్టు షేర్ చేశాడు. దానిని గుర్తు చేస్తూ పూరన్ ఇలా కామెంట్లు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్