KL Rahul: సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావం నాపై తీవ్రంగా ఉంది: కేఎల్ రాహుల్
లఖ్నవూ రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం కారణంగా ఐపీఎల్ సీజన్లోని కీలక సమయంలో వైదొలిగాడు. కానీ, అతడి స్థానంలో కృనాల్ పాండ్య జట్టును నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన ట్రోలింగ్ను కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గత బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ నుంచి టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుత ఐపీఎల్లో 9 మ్యాచ్లను ఆడిన రాహుల్.. గాయం కారణంగా టోర్నీతోపాటు వచ్చేనెలలో జరిగే (జూన్ 7 నుంచి) ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కూ దూరమయ్యాడు. లఖ్నవూ సూపర్ జెయింట్స్ సారథ్య బాధ్యతలను కేఎల్ నుంచి కృనాల్ పాండ్య తీసుకున్నాడు. తాజాగా ముంబయిపై లఖ్నవూ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి అడుగు ముందుకేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. తనలాగే ఇతర క్రికెటర్లూ ప్రభావితులైన వారిలో ఉన్నారని పేర్కొన్నాడు. ఏ ఆటగాడు కూడానూ కావాలనే చెత్తగా ఆడరని, ఇదంతా జీవితంలో ఓ భాగమని చెప్పాడు.
‘‘సోషల్మీడియా ట్రోలింగ్ వల్ల నాతోపాటు ఇతర ప్లేయర్లపైనా ప్రభావం పడింది. ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లకు మద్దతు చాలా అవసరం. ఇలా ఇతరుల మీద కామెంట్ లేదా ట్రోలింగ్ చేయడాన్ని తమ హక్కుగా కొందరు భావిస్తారు. వారేం కామెంట్లు చేయాలని అనుకుంటారో అదే చేసేస్తారు. క్రికెటర్లు ఎవరూ కూడానూ కావాలని చెత్తగా ఆడాలని కోరుకోరు. ఇది మన జీవితం. నాకు క్రికెట్ కాకుండా మరొకటి తెలియదు. క్రికెట్ ఆడటం మాత్రమే నాకు తెలుసు. నేను సీరియస్గా లేనని, కష్టపడనని ప్రతి ఒక్కరూ ఎందుకు అనుకుంటారు? క్రీడల్లో మరీ దారుణంగా ప్లేయర్లను ట్రోల్స్ చేస్తారు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం మన వైపు లేకపోతే ఏం చేయలేం కదా’’ అని రాహుల్ తెలిపాడు.
ది మ్యాంగో గయ్.. నవీనుల్ హక్
ముంబయిపై విజయం సాధించడంతో లఖ్నవూ ఆటగాళ్లు జోష్ మీదున్నారు. ఈ సందర్భంగా సహచరుడు నవీనుల్ హక్తో కలిసి నికోలస్ పూరన్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్గా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత తమ బస్లో హోటల్ గదికి చేరుకునే క్రమంలో.. నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. నవీనుల్ను ‘ది మ్యాంగ్ గయ్’గా అభివర్ణించాడు. గతవారం ముంబయి - బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ (1) త్వరగా ఔట్ కావడంతో నవీనుల్ ‘స్వీట్ మ్యాంగోస్’ అంటూ ఇన్స్టాలో పోస్టు షేర్ చేశాడు. దానిని గుర్తు చేస్తూ పూరన్ ఇలా కామెంట్లు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు