KL Rahul: మరోసారి చెబుతున్నా.. స్ట్రైక్రేట్పై నాది అదే మాట: కేఎల్ రాహుల్
క్రికెట్లో (Cricket) స్ట్రైక్రేట్ చాలా కీలకమని అందరికీ తెలుసు. అయితే స్ట్రెక్రేట్ కోసం దూకుడుగా ఆడాలని చూస్తే మాత్రం వికెట్ కోల్పోక తప్పదు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం టీమ్ఇండియా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా ఆసీస్తో నాలుగు టెస్టుల (IND vs AUS) సిరీస్ను ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల తర్వాత భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్తోనే వన్డే సిరీస్లో తలపడనుంది. అనంతరం మార్చి 31 నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) మొదలుకానుంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో స్ట్రైక్రేట్పై సోషల్ మీడియా వేదికగా చర్చ కొనసాగుతోంది. తాజాగా దీనిపై టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రత్యేకంగా స్పందించాడు. స్ట్రైక్రేట్పై అతిగా అంచనా వేస్తున్నారని వ్యాఖ్యానించాడు. లఖ్నవూ కెప్టెన్ అయిన రాహుల్ గత సీజన్లోనూ మెరుగ్గానే రాణించాడు.
లఖ్నవూ కొత్త జెర్సీ లాంచ్ ఈవెంట్ సందర్భంగా రాహుల్, గౌతమ్ గంభీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ మాట్లాడుతూ.. ‘‘ఫార్మాట్ ఏదైనా సరే స్ట్రైక్రేట్ కీలకమే. కానీ, దానిని అతిగా అంచనా వేసి చెప్పడం సరైంది కాదు. ఇదే మాట గతంలోనూ నేను చెప్పా. పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. మీరు మ్యాచ్లో 140 పరుగులనే ఛేదించాల్సి వచ్చిందనుకోండి.. అప్పుడు 200 స్ట్రైక్రేట్ అవసరం లేదు. అందుకే, మ్యాచ్నుబట్టి బ్యాటింగ్ దూకుడుగా చేయాల్సి ఉంటుంది’’ అని తెలిపాడు. గత కొన్నేళ్లుగా భారత్ తరఫున గొప్పగా రాణించలేకపోతున్న కేఎల్ రాహుల్పై ఆసీస్తో మూడో టెస్టులో వేటు పడింది. అయితే, అతడి స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్ కూడా గొప్పగా ఏమీ రాణించలేదు. దీంతో నాలుగో టెస్టులో రాహుల్కు చోటు కల్పించాలనే డిమాండ్లూ వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.