KL Rahul: కివీస్తో టెస్టు సిరీస్.. రాహుల్ ఔట్
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత్కు ఎదురు దెబ్బతగిలింది. కివీస్పై..
జట్టులోకి సూర్యకుమార్ యాదవ్
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత్కు ఎదురు దెబ్బతగిలింది. న్యూజిలాండ్పై మూడు టీ20ల సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలో కివీస్పై రెండు టెస్టుల సిరీస్ను కూడా గెలుచుకోవాలని భావిస్తున్న టీమ్ఇండియాకు షాక్లాంటి వార్త. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని ట్వీట్ చేసింది. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎడమ చేతి కండరాల సంబంధిత గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నట్లు సమాచారం. అయితే దానిపై బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లోనూ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు.
కివీస్తో తొలి టెస్టుకు కేఎల్ రాహుల్ గైర్హాజరు నేపథ్యంలో మయాంక్ అగర్వాల్తో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్కు వచ్చే అవకాశం ఉంది. అలానే రాహుల్కు బదులు సూర్యకుమార్ యాదవ్కు జట్టులో స్థానం దక్కింది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తే మాత్రం.. రహానె, శ్రేయస్, వృద్ధిమాన్తో కలిసి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ఇండియా జట్టుతోపాటు వెళ్లిన సూర్యకుమార్కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్యా రహానె సారథ్యం వహిస్తుండగా.. ఛెతేశ్వర్ పుజారా వైస్కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రెండో టెస్టుకు (డిసెంబర్ 3-7) విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చేస్తారు. విరాట్ నాయకత్వంలోనే టీమ్ఇండియా రెండో టెస్టు మ్యాచ్ను ఆడనుంది.
తొలి టెస్టుకు భారత జట్టు:
అజింక్యా రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు