KL Rahul: డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూరంగా ఉంటా: ఇన్స్టాలో కేఎల్ రాహుల్
లఖ్నవూ రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) ఈ ఐపీఎల్ సీజన్లోని మిగతా మ్యాచ్లతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూరమైనట్లే. తన ఇన్స్టాగ్రామ్లో రాహుల్ తన గాయంతో సహా ఇతర విషయాలపై సుదీర్ఘంగా పోస్టు రాసుకొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 టోర్నీలో (IPL 2023) బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో గాయపడిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. కేఎల్ రాహుల్ తన గాయం పరిస్థితిని అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నట్లు వెల్లడించాడు. లఖ్నవూకు రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్య సారథ్య బాధ్యతలు చేపడతాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ పాండ్యనే కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో కేఎల్ రాహుల్ కీలక విషయాలను తెలిపాడు.
‘‘బీసీసీఐ వైద్య బృందం సహకారంతో త్వరలోనే నా తొడ గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నా. కొద్ది వారాల్లోనే తిరిగి కోలుకుని మైదానంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టమే కానీ, ఇదే సరైనదని భావిస్తున్నా. లఖ్నవూ జట్టు సారథిగా మరింత బాధిస్తుంది. కీలకమైన సమయంలో జట్టును వీడాల్సి వచ్చింది. అయితే, జట్టు సహచరులు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటారని ఆశిస్తున్నా. బయట నుంచి వారిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూనే ఉంటా. ప్రతి మ్యాచ్ను వీక్షిస్తా.
అలాగే వచ్చే నెలలో ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ భాగం కాలేకపోతున్నా. అయితే, త్వరలోనే బ్లూ జెర్సీ వేసుకొని ఆడతానని బలంగా నమ్ముతున్నా. ప్రస్తుతం మాత్రం గాయం నుంచి కోలుకుని రావడంపైనే దృష్టి పెడుతున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభిమానుల ఆశీస్సులతో బలంగా తిరిగి వస్తా. ఎల్ఎస్జీ మేనేజ్మెంట్, బీసీసీఐ, జట్టు సభ్యులు కష్టసమయాల్లో మద్దతుగా నిలిచారు. మీ ప్రోత్సాహంతో ఇంతకుముందు కంటే మరింత ఫిట్గా తయారై జట్టుతో కలుస్తా. గాయానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను మీతో పంచుకుంటా’’ అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
ప్రస్తుత సీజన్లో లఖ్నవూ 10 మ్యాచ్లను ఆడి 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. మరోవైపు జూన్ 7 నుంచి జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ స్థానంలో టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ను తీసుకొనే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్