Stadiums: భారతావనిలో సువిశాల మైదానాలివి..!
సువిశాల భారత దేశంలో క్రీడాభిమానులకు కొదవలేదు. మరి ఇష్టమైన ఆటగాళ్లు అతిపెద్ద మైదానాల్లో ఆడుతుంటే ఆ మజానే వేరు కదా.. వేలమంది చేసే అరుపులు, కేకలతో భారీ స్టేడియం మార్మోగిపోయే దృశ్యాలను..
ఇంటర్నెట్ డెస్క్: సువిశాల భారత దేశంలో క్రీడాభిమానులకు కొదవలేదు. మరి ఇష్టమైన ఆటగాళ్లు అతిపెద్ద మైదానాల్లో ఆడుతుంటే ఆ మజానే వేరు కదా.. వేలమంది చేసే అరుపులు, కేకలతో భారీ స్టేడియం మార్మోగిపోయే దృశ్యాలను టీవీలో చూస్తేనే భలేగుంటుంది. అలాంటి పెద్ద స్టేడియాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎంత కెపాసిటీతో ప్రేక్షకులు వీక్షించవచ్చో తెలుసుకోండి మరి..
నరేంద్ర మోదీ స్టేడియం..
తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానాన్నే గతేడాది భారీ మార్పులతో పునర్నిర్మాణం చేపట్టారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ 1983లో పటేల్ మైదానాన్ని నిర్మించింది. దాదాపు 1,10,000 సీటింగ్ సామర్థ్యంతో అప్పట్లో నిర్మాణం చేపట్టింది. ఇందులో 1966, 2011 క్రికెట్ ప్రపంచ కప్, ఐసీసీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు జరిగాయి. అలానే ఎన్నో టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే పునర్నిర్మాణం కోసం 2015లో స్టేడియంను మూసివేశారు. గతేడాది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లో భాగంగా ‘నరేంద్ర మోదీ స్టేడియం’ నిర్మాణం జరిగింది. దాదాపు 63 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో 1.32 లక్షల మంది కూర్చోవచ్చు. ఇందులో తొలిసారిగా హైమాస్ట్ ఫ్లడ్లైట్లకు బదులుగా ఎల్ఈడీ లైట్లు వాడారు.
కోల్కతాలో రెండు భారీ స్టేడియాలు..
కోల్కతా అనగానే ఈడెన్ గార్డెన్స్ గుర్తుకొస్తుంది కదా.. అయితే ఈడెన్ గార్డెన్స్ కంటే కూడా పెద్దదైన స్టేడియం మరొకటి ఉంది. అదే సాల్ట్ లేక్ సిటీ స్టేడియం. 1984లో నిర్మించిన స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్లు చాలా జరిగాయి. 2011వ సంవత్సరంలో మరమ్మత్తుల చేసే వరకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియంగా దీనికి పేరుంది. దాదాపు 1.20 లక్షల సీటింగ్ కెపాసిటీ ఉంది. అయితే 1997లో జరిగిన ఫెడరేషన్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ను రికార్డు స్థాయిలో 1,31,781 మంది వీక్షించడం విశేషం. ప్రస్తుతం స్డేడియం సామర్థ్యం 85 వేలు. పునర్నిర్మాణంలో భాగంగా స్టేడియంలో అనేక మార్పులు చేశారు. త్రీ లేయర్ గ్రాస్ పిచ్, వీఐపీ బాక్సుల పెంపు, ప్రాక్టీస్ పిచ్లు, బకెట్ టైప్ సీటింగ్ను ఏర్పాటు చేశారు.
* ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితమే...
కోల్కతాలో 1964లో నిర్మితమైన ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అంటే ప్రతి క్రికెట్ అభిమాని ఎగిరిగంతేస్తాడు. ఎన్నో ఉత్కంఠభరిత పోరులకు వేదికగా ఈడెన్ గార్డెన్స్ నిలిచింది. 1987 ప్రపంచకప్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు థ్రిల్లింగ్ కలిగించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో గెలిచిన ఆసీస్ వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. అలాంటి ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కెపాసిటీ 68 వేలు. 2001లో ఆస్ట్రేలియాపైనే హర్భజన్ హ్యాట్రిక్తో చెలరేగిన విషయం ఎప్పటికీ మరువలేం. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హోం గ్రౌండ్ అయిన ఈడెన్లోనే కెరీర్లో తన మొదటి, ఆఖరితోపాటు మరికొన్ని సెంచరీలు చేయడం విశేషం. ప్రస్తుతం ఐపీఎల్తోపాటు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తోంది.
ఉత్తమ మైదానాల్లో ఇదొకటి..
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం 2008వ సంవత్సరంలో రాయ్పుర్ వేదికగా నిర్మించిన షాహీబ్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం కెపాసిటీ 65 వేలు. 2010లో కెనడా జాతీయ జట్టు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర జట్టు తొలిసారి తలపడ్డాయి. ఇప్పటికే పలు ఐపీఎల్, ఛాంపియన్ లీగ్ పోటీలతోపాటు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. 2001లో స్టేడియం నిర్మాణం ప్రారంభమైనప్పటికీ పూర్తయ్యేందుకు దాదాపు ఏడేళ్ల సమయం పట్టింది. దిల్లీ డేర్డేవిల్స్కు రెండో హోంగ్రౌండ్గా రాయ్పుర్ను ఎంపిక చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ప్రధాన పర్యాటక ఆకర్షణగా స్టేడియం నిలిచింది.
కామన్వెల్త్ గేమ్స్తో ప్రాచుర్యంలోకి...
అరవై వేల సీటింగ్ కెపాసిటీతో 1982లో ప్రారంభమైన దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పదకొండేళ్ల కిందట జరిగిన కామన్వెల్త్ గేమ్స్తో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు అతిథ్యమిచ్చింది. అయితే 2011లో కామన్వెల్త్ గేమ్స్ పోటీలను ఈ స్టేడియంలోనే నిర్వహించారు. ఒలింపిక్స్ స్థాయిలో పదివరుసల సింథటిక్ రన్నింగ్ ట్రాక్లు ఉండటం విశేషం. వార్మప్ ట్రాక్లు, ప్రాక్టీస్ ఏరియా, సింథటిక్ గ్రాస్ ఫీల్డ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. క్రీడలే కాకుండా ఫుడ్ ఫెస్టివల్స్, కాన్సెర్ట్లు వంటి ఇతర ఈవెంట్లు బోలెడు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల