Rishabh Pant: ఒత్తిడిలో ఎలా ఆడాలో కోహ్లీ నేర్పుతాడు: పంత్
టీ20 ప్రపంచకప్ మెగా సమరాన్ని భారత్ దాయాది పోరుతో మొదలుపెట్టనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రిషభ్ పంత్ మాట్లాడుతూ.. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే అని తెలిపాడు.
మెల్బోర్న్: ఆటలో ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ అపార అనుభవం చాలా ఉపయోగపడుతుందని స్టార్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ ఆదివారం భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ వెబ్సైట్ పంత్ను ఇంటర్వ్యూ చేయగా.. అతడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందన్న పంత్.. గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో దాయాదుల పోరును గుర్తుచేసుకున్నాడు.
‘‘వాస్తవ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కోహ్లీ నేర్పుతాడు. అది మన క్రికెట్ ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతడితో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఉత్తమం. దాని వల్ల మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఒత్తిడి పరిస్థితుల్లో బంతులను పరుగులుగా ఎలా మలచాలి అన్నది నేర్పిస్తాడు’’ అని రిషభ్ తెలిపాడు.
ఈ సందర్భంగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ - పాక్ మ్యాచ్ను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ మ్యాచ్లో హసన్ అలీ బౌలింగ్లో నేను ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాదాను. ఆ రోజు టీమిండియా మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. దీంతో నేను, విరాట్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాం. రన్రేట్ను పెంచే ప్రయత్నం చేశాం. ఆ సమయంలోనే నేను ఒంటి చేత్తో రెండు సిక్స్లు కొట్టడం నాకు గుర్తుంది’’ అని పంత్ గుర్తుచేసుకున్నాడు.
అది భావోద్వేగాలతో కూడిన మ్యాచ్..
దాయాది పాకిస్థాన్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని పంత్ అన్నాడు. ‘‘పాక్తో ఆట అంటే ఎంతో హైప్ ఉంటుంది. అది భావోద్వేగాలతో కూడుకున్న మ్యాచ్. ఆటగాళ్లకే కాదు.. అభిమానులు.. ప్రతి ఒక్కరూ ఎంతో ఉద్వేగంతో చూస్తారు. అదో విభిన్న అనుభూతి. మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ కోలాహలం అంతా మరో స్థాయిలో ఉంటుంది. అందుకే పాక్తో ఆట ఎప్పుడూ ప్రత్యేకంగానే అనిపిస్తుంది’’ అని పంత్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!