IPL 2021: కోహ్లి కచ్చితంగా గొప్ప నాయకుడే: హర్షల్ పటేల్
క్రికెట్లో ఎంతో మంది సారథులున్నారు, నాయకులున్నారు కానీ విరాట్ కోహ్లి మాత్రం కచ్చితంగా గొప్ప నాయకుడని రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు హర్షల్ పటేల్ అన్నాడు. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఎలిమినేటర్..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఎంతో మంది సారథులున్నారు.. నాయకులున్నారు గానీ విరాట్ కోహ్లి మాత్రం కచ్చితంగా గొప్ప నాయకుడని రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు హర్షల్ పటేల్ అన్నాడు. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కెప్టెన్గా కోహ్లికి ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం.
‘ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్గా తప్పుకుని ఉండొచ్చు. అయినా అతడో గొప్ప నాయకుడు. తమ ప్రణాళికలను అమలు చేయడానికి విరాట్ కోహ్లి బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. 2012 నుంచి అతడితో కలిసి ఆడుతున్నా. అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. కోహ్లి కెప్టెన్సీ విషయానికొస్తే.. క్రికెట్లో ఎంతో మంది సారథులున్నారు. నాయకులున్నారు. అయితే, కోహ్లి మాత్రం గొప్ప నాయకుడు. అతడు కెప్టెన్గా తప్పుకొన్నంత మాత్రాన.. అతన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. జట్టుకు అతడు అందించిన సేవలు అమూల్యమైనవి. కెరీర్పరంగా నా ఎదుగుదలకు కోహ్లి ఎంతో సహకరించాడు’ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు.
2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లి.. 2013 నుంచి జట్టుకి సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2016లో కోహ్లి నాయకత్వంలో బెంగళూరు ఫైనల్ వరకు వెళ్లగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే