Umesh Yadav : ఉమేశ్‌ను దక్కించుకోవడమే ఈ మెగా వేలంలో అత్యుత్తమ కొనుగోలు: హస్సీ

తొలి మ్యాచ్‌లోనే గత సీజన్ ఛాంపియన్‌ చెన్నైను చిత్తు చేసిన...

Published : 06 Apr 2022 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్: తొలి మ్యాచ్‌లోనే గత సీజన్ ఛాంపియన్‌ చెన్నైను చిత్తు చేసిన కోల్‌కతా రెండో మ్యాచ్‌లో మాత్రం బెంగళూరుపై పోరాడి ఓడింది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌-4లో కొనసాగుతోంది. ఈ క్రమంలో కోల్‌కతా రాణించడంలో కీలక పాత్ర ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్‌ పోషిస్తున్నాడు. మూడు మ్యాచుల్లోనే 4.9 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ముందున్నాడు. ఉమేశ్ యాదవ్‌ను మెగావేలంలో కనీస ధర రూ. 2 కోట్లకే కోల్‌కతా దక్కించుకుంది. ఉమేశ్‌ యాదవ్‌ ప్రదర్శనపై కోల్‌కతా మెంటార్‌ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. 

‘‘ఉమేశ్‌ యాదవ్‌ను దక్కించుకోవడమే టీ20 లీగ్‌ మెగా వేలంలో అత్యుత్తమ కొనుగోలుగా భావిస్తున్నా. మ్యాచ్‌ ఆరంభంలోనే వికెట్లను తీస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు. కోల్‌కతా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో కలిసి ఉమేశ్‌ యాదవ్‌ బాగా పని చేస్తున్నారు. ప్రతి గేమ్‌ కోసం ఉమేశ్‌ చాలా కష్టపడతాడు’’ అని హస్సీ పేర్కొన్నాడు. ఈ విధంగా ఎలా ఆడగలుగుతున్నావని ఉమేశ్‌ను అడిగితే ‘నా మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే నా వెనక మద్దతుగా సహాయక సిబ్బంది ఉన్నారు. మరీ ముఖ్యంగా భరత్‌ అరుణ్‌ కోచింగ్‌లో ఉత్తమంగా ఆడగలుగుతున్నా’ అని చెప్పేవాడని డేవిడ్ హస్సీ గుర్తు చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని