LSG vs MI: ‘రిటైర్డ్ హర్ట్’ కావడానికి కారణమదే: కృనాల్ పాండ్య
ముంబయిపై లఖ్నవూ (LSG vs MI) అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఐదు పరుగుల తేడాతో గెలిచిన లఖ్నవూ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో (IPL 2023) ప్లేఆఫ్స్ స్థానాల కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. కీలక సమయంలో ముంబయి ఇండియన్స్ (MI) తడబాటుకు గురై లఖ్నవూ (LSG) చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లఖ్నవూ (15 పాయింట్లు) మూడో ప్లేస్కు చేరింది. ముంబయి (14 పాయింట్లు) నాలుగులో కొనసాగుతోంది. ముంబయిపై లఖ్నవూ విజయం సాధించడంలో కెప్టెన్ కృనాల్ పాండ్య (49*) కీలక పాత్ర పోషించాడు. వరుసగా వికెట్లు పడినప్పుడు స్టాయినిస్ (89)తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అయితే, పాండ్య హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిటైర్డ్ హర్ట్గా డగౌట్కు వెళ్లాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. దీంతో మరో పరుగు చేస్తే హాఫ్ సెంచరీ తన ఖాతాలో పడే అవకాశం ఉన్నప్పటికీ.. రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
‘‘తొడ కండరాలు పట్టేశాయి. దీంతో కాలు తిమ్మిరికి గురైంది. నేను ఎప్పుడూ జట్టు ఆటగాడినే. ఏదైనా సరే జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధం. చివరి మ్యాచ్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సీజన్లో మోసిన్ కేవలం మూడో మ్యాచ్ ఆడాడు. సర్జరీ తర్వాత ఐపీఎల్లో పాల్గొన్నాడు. ఇలా బౌలింగ్ చేయడం అంత సులువేం కాదు. సొంత మైదానం వేదికగా చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది.
ఆ మూడు ఓవర్లే..: రోహిత్ శర్మ
‘‘మేం విజయం సాధించే దిశగా ఆడలేకపోయాం. గెలుపు కోసం కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ విజయం దక్కలేదు. బ్యాటింగ్కు అనుకూలంగానే ఉంది. టార్గెట్ కూడా ఛేదన చేసేలా అనిపించింది. అయితే, మేం బ్యాటింగ్ చేసే సమయంలో తడబాటుకు గురయ్యాం. అలానే లఖ్నవూకు చివరి మూడు ఓవర్లలో అదనంగా పరుగులు ఇవ్వడం నష్టం చేసింది. ఇప్పుడు పాయింట్లు, నెట్రన్రేట్ గురించి ఆలోచించడం లేదు. చివరి మ్యాచ్లో (హైదరాబాద్తో) విజయం సాధించడంపైనే దృష్టిపెడతాం’’ అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
అశ్విన్ స్పందన..
కృనాల్ పాండ్య రిటైర్డ్ హర్ట్ కావడంపై టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్లో స్పందించాడు. ‘‘రిటైర్డ్ ఔట్..?’’ అని ట్వీట్ చేశాడు. దీనికి ఓ అభిమాని.. ‘‘ఇదంతా చీటింగ్’’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. ‘‘అలా కావడానికి నిబంధనలు అనుమతిస్తాయి. ఇక్కడ మోసం ఏమీ లేదు’’ కామెంట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా