తండ్రి కోసం పాండ్య సోదరులు ఏం చేశారంటే..!
పాండ్య సోదరులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి తమతో లేకున్నా ఆయన దుస్తులైనా డ్రస్సింగ్ రూమ్లో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్పై విజయం తర్వాత హార్దిక్ తన సోదరుడు కృనాల్ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది....
టీమ్ఇండియా డ్రస్సింగ్ రూమ్లోకి తండ్రి సూట్కేస్
ఇంటర్నెట్ డెస్క్: పాండ్య సోదరులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి తమతో లేకున్నా ఆయన దుస్తులైనా డ్రస్సింగ్ రూమ్లో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్పై విజయం తర్వాత హార్దిక్ తన సోదరుడు కృనాల్ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది.
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో టీమ్ఇండియా దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్కు వచ్చి 317 పరుగులు చేసింది. వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ విజృంభించి ఆడాడు. బౌండరీలు బాదేస్తూ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు 31 బంతుల్లోనే అర్ధశతకం చేయడం గమనార్హం. అంతే కాకుండా బౌలింగ్లో ఒక వికెట్ తీశాడు. కోహ్లీసేన 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన అర్ధశతకాన్ని కొన్నాళ్ల క్రితం చనిపోయిన తన తండ్రికి అంకితమిస్తున్నానని ప్రకటించాడు.
‘ఈ ప్రదర్శన నాన్నకు అంకితమిస్తున్నా. ఆయన ఆశీర్వాదాలు ఎప్పటికీ మన వెంట ఉంటాయి. మనిద్దరికీ భావోద్వేగం కలిగించే అంశమిది. నీ (హార్దిక్) నుంచి టోపీ అందుకోవడం చూసి ఆయన (నాన్న) సంతోషించే ఉంటారు’ అని కృనాల్ అన్నాడు.
‘16న ఉదయం ఆయన మరణించారు. ఆ రోజు నేను ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్నా. తర్వాత రోజు ఉదయం ఏ దుస్తులు వేసుకోవాలో ముందురోజు రాత్రే సిద్ధం చేసుకోవడం నాన్నకు అలవాటు. అందుకే ఆయన దుస్తుల సంచీని బరోడా నుంచి ఇక్కడికి తీసుకొచ్చా. ఆయన లేరని తెలుసు. అందుకే మ్యాచ్ వీక్షించేందుకు ఆయన ధరించే దుస్తులనైనా ఇక్కడికి తీసుకొచ్చాను. డ్రస్సింగ్ రూమ్లో ఉంచాలనుకున్నాను’ అని కృనాల్ వెల్లడించాడు.
‘మన జీవిత కాలంలో తొలిసారి మన నాన్న డ్రస్సింగ్ రూమ్లోకి వచ్చాడు. ఆయనెప్పుడూ మనతోనే ఉంటారు. మనిద్దరి తరఫున నువ్వు అద్భుతంగా ఆడావ్ కృనాల్. ఆయనకు నువ్వు ముందే పుట్టినరోజు కానుక ఇచ్చినట్టు నాకు అనిపించింది’ అని హార్దిక్ భావోద్వేగం చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య