Vaccine వేయించుకున్న కుల్‌దీప్‌ యాదవ్

టీమిండియా ఆటగాళ్లు వరుసగా కొవిడ్ 19 టీకాలను వేయించుకుంటున్నారు.  వీలైనంత తొందరగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌

Published : 16 May 2021 11:44 IST

(photo:Kuldeep Yadav Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా ఆటగాళ్లు వరుసగా కొవిడ్ 19 టీకాలను వేయించుకుంటున్నారు.  వీలైనంత తొందరగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌  వేయించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానే,  శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్, శుభమన్ గిల్‌, టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ ఛతేశ్వర్ పూజారా, అతని భార్య పూజా, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్ శర్మ, అతని భార్య ప్రతిమ సింగ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా జడేజా ఇప్పటికే కొవిడ్ 19 మొదటి డోసు టీకా తీసుకున్నారు. 

తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా చేరాడు. శనివారం కొవిడ్ టీకా మొదటి డోసును తీసుకున్న కుల్‌దీప్... ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని కోరాడు. ‘మీకు అవకాశం వచ్చిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. సురక్షితంగా ఉండండి. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో మనం ఐక్యంగా ఉండాలి’అని హిందీలో రాసి తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను  ట్విటర్‌లో పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని