IPL 2022 : ఐపీఎల్ 15వ సీజన్.. ఈసారి రాజస్థాన్ ‘తగ్గేదేలే’: సంగక్కర
ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే టైటిల్ నెగ్గిన జట్టు రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత ఒక్కటంటే...
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే టైటిల్ నెగ్గిన జట్టు రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కసారీ కప్ను ముద్దాడలేకపోయింది. గత మూడు సీజన్లను అట్టడుగు స్థానాలతోనే ముగించడం విశేషం. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన పోటీనిస్తామని రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర తెలిపాడు. ‘‘గత కొన్నేళ్లుగా మా జట్టు సరిగ్గా రాణించలేదని తెలుసు. అందుకే ఐపీఎల్ మెగా వేలం కోసం ఆఫ్-సీజన్లో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేశాం. వేలంలో ఆటగాళ్లను ఎంపిక చేసుకునేటప్పుడు మా దృష్టికి అవసరమైన కీలకమైన విషయాలను గుర్తించాం. అందుకే మెగా వేలంలో అనుకున్న లక్ష్యాలను అందుకున్నాం. బలమైన జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాం’’ అని సంగక్కర వివరించాడు.
జట్టులోకి టీమ్ఇండియా టాప్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ చేరిక గతేడాది ప్రదర్శనకు భిన్నంగా ఉండబోతోందని సంగక్కర అభిప్రాయపడ్డాడు. ‘‘అన్ని విభాగాలను పటిష్ఠంగా ఉంచేందుకు ప్రయత్నించాం. నీషమ్, మిచెల్, వాన్డర్ డస్సెన్తో మిడిలార్డర్ బలంగా ఉంది. పేస్, స్పిన్ బౌలింగ్ సహా బ్యాటింగ్లోనూ స్ట్రాంగ్ జట్టు. ఈసారి ఎక్కువగా యువ ఆటగాళ్లను తీసుకున్నాం. కోర్ ప్లేయర్లను కొనుగోలు చేసుకుని సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఆటగాళ్లపరంగా ఎలాంటి అనుమానం లేదు. అయితే ఫీల్డ్లో ఒత్తిడిని తట్టుకోవడం, ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే ప్రస్తుతం కీలకం. ఇక నా కర్తవ్యం మాత్రం ఫ్రాంచైజీకి విలువ తీసుకొచ్చి, మంచి క్రికెటర్లను జట్టులోకి తీసుకునేలా చేయడమే.. దీనిని పూరిస్థాయిలో అమలు చేశానని భావిస్తున్నా’’ అని సంగక్కర పేర్కొన్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబయి, పుణెలోని నాలుగు మైదానాల్లో మొత్తం మ్యాచ్లను బీసీసీఐ నిర్వహించనుంది.
షేన్వార్న్ మృతి క్రీడాలోకానికి తీరని లోటు
తొలి సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్కు ఐపీఎల్ టైటిల్ను అందించిన క్రికెట్ దిగ్గజం షేన్వార్న్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి షేన్వార్న్ను సంగక్కర గుర్తు చేసుకున్నాడు. వార్న్ లేకపోవడం క్రికెట్కు తీరనిలోటని పేర్కొన్నాడు. ఆటపట్ల అంకితభావం, పరిపూర్ణ పరిజ్ఞానం ఉన్న మేధావి, స్నేహితుడైన వార్న్ మృతి తీవ్రంగా కలిచివేసిందన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్