WTC Final: బాత్రూమ్లో దాక్కున్న జేమీసన్
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు కైల్ జేమీసన్. కోహ్లీసేనను అతడు రెండు ఇన్నింగ్సుల్లో బంతితో దెబ్బకొట్టాడు. అలాంటిది ఆరో రోజు ఆఖరి సెషన్లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ బ్యాటింగ్ చేస్తుంటే ఆందోళనతో బాత్రూమ్లో...
టీమ్ఇండియా అభిమానుల శబ్దాలతో ఆందోళన పడ్డాడట!
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు కైల్ జేమీసన్. కోహ్లీసేనను అతడు రెండు ఇన్నింగ్సుల్లో బంతితో దెబ్బకొట్టాడు. అలాంటిది ఆరో రోజు ఆఖరి సెషన్లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ బ్యాటింగ్ చేస్తుంటే ఆందోళనతో బాత్రూమ్లో దాక్కున్నాడట! టీమ్ఇండియా అభిమానులు చేసే శబ్దాలే ఇందుకు కారణమని తెలిపాడు.
‘బహుశా నా కెరీర్లో క్రికెట్ వీక్షించడంలో కఠినమైన సమయం ఇదే కావొచ్చు. మేం లోపల కూర్చొని టీవీలో క్రికెట్ చూస్తున్నాం. మైదానానికి, ప్రత్యక్ష ప్రసారానికి మధ్య కొంత అంతరం ఉంటుంది. కానీ బంతి బంతికీ భారత అభిమానులు శబ్దాలు చేసేవారు. అప్పుడే వికెట్ పడ్డట్టు అరుపులు వినిపించేవి. తీరా చూస్తే బంతిని డిఫెండ్ చేయడం లేదా సింగిల్ తీయడం కనిపించేది’ అని జేమీసన్ అన్నాడు.
‘నిజంగా క్రికెట్ చూడటం నాకు కఠినంగానే అనిపించింది. ఆ శబ్దాలను తప్పించుకొనేందుకు నేను చాలాసార్లు బాత్రూమ్కు వెళ్లాను. ఎందుకంటే నాకు ఉత్కంఠంగా అనిపించేది. కానీ క్రీజులో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ ఉండటం అదృష్టం. వారిద్దరూ గొప్ప బ్యాట్స్మెన్. ఆందోళనను అధిగమించి ప్రశాంతంగా పని ముగించారు’ అని జేమీసన్ తెలిపాడు.
కొవిడ్-19 వల్ల బయటకు వెళ్లి విజయ సంబరాలు జరుపుకోలేక పోయామని జేమీసన్ అన్నాడు. డ్రస్సింగ్ రూమ్లోనే వేడుకలు చేసుకున్నామని తెలిపాడు. రెండేళ్లుగా అందరం కలిసే సమయం గడపడంతో సాన్నిహిత్యం పెరిగిందని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు