IND vs AUS: భారత్తో టెస్టు సిరీస్.. అశ్విన్ బౌలింగ్ కోసం ఎదురు చూస్తున్నా: ఆసీస్ బ్యాటర్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో భాగంగా భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ (IND vs AUS) వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్తో (Team India) ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం ఆసీస్ (Aussies) ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా కీలక బ్యాటర్ మార్నస్ లబుషేన్ అయితే.. టీమ్ఇండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లేందుకు ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకం. తొలి రెండు స్థానాల్లో ఆసీస్, భారత్ ఉన్నా.. శ్రీలంక కూడా మూడో స్థానంలో ఫైనల్ బెర్తు కోసం బరిలో ఉంది.
‘‘గతంలో టీమ్ఇండియాతో జరిగిన సిరీస్ నుంచి స్పిన్ బౌలింగ్ గురించి ఆలోచించడం ప్రారంభించా. అశ్విన్ బౌలింగ్ గురించి విన్నప్పటి నుంచి నా ఆటతీరులో కాస్త మార్పు చేశా. అతడి బౌలింగ్ ప్రణాళికలను విఫలం చేయడానికి కసరత్తు కూడా మొదలుపెట్టా. అందుకే భారత్ - ఆసీస్ పోరు చదరంగం మాదిరిగా రసవత్తరంగా ఉండటం ఖాయం. టెస్టు సిరీస్ కోసం నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికే నా ఆలోచనలను సిద్ధం చేసుకొన్నా. ఇక మ్యాచ్ సమయంలో అమలు చేయడమే తరువాయి. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అని లబుషేన్ తెలిపాడు.
గావస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలను ఆడేందుకు ఆసీస్ ఫిబ్రవరిలో పర్యటించనుంది. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా వైజాగ్ వేదికగా రెండో వన్డేలో భారత్, ఆసీస్ తలపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)