Lakshya Sen: ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు లక్ష్యసేన్‌

ఏడేళ్ల తర్వాత ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు..

Updated : 19 Mar 2022 21:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏడేళ్ల తర్వాత ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత ఆటగాడు లక్ష్యసేన్‌ చేరుకున్నాడు. పురుషుల విభాగం సెమీస్‌లో మలేషియా ఆటగాడు లీ జీ జియాపై 21-13, 12- 21, 21-19 తేడాతో లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. దీంతో సింగిల్స్‌ విభాగంలో ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ప్రకాశ్‌ నాథ్‌ (1947, రన్నరప్‌), ప్రకాశ్‌ పదుకొణె (1980-విజేత, 1981-రన్నరప్), పుల్లెల గోపీచంద్ (2001, విజేత), సైనా నెహ్వాల్ (2015, రన్నరప్‌) ఫైనల్‌కు చేరిన వారిలో ఉన్నారు. టైటిల్‌ను నెగ్గితే మూడో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని