Lakshya Sen : ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కి లక్ష్యసేన్‌

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ ...

Published : 18 Mar 2022 20:12 IST

క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు వాకోవర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ దూసుకుపోతున్నాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్‌ను ఓడించి మరీ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్యసేన్‌కు అదృష్టం కలిసొచ్చింది. క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు లు జువాంగ్ జు తప్పుకోవడం (వాకోవర్‌) లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరుకున్నాడు. ఇప్పటికే సింగిల్స్‌ విభాగంలో కిదాంబి రెండో రౌండ్‌లో వెనుదిరగగా.. మహిళల విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.

భారత్‌కు చెందిన డబుల్స్‌ ఐదో సీడెడ్ సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి -చిరాగ్‌ శెట్టి  క్వార్టర్స్‌ దాటలేకపోయారు. ఇండోనేషియా టాప్‌ సీడ్ మార్కస్‌ ఫెర్నాల్డ్‌ గిడోయిన్‌, కెవిన్‌ సంజయా సుకుమౌల్జో చేతిలో 22-24, 17-21 తేడాతో సాయిరాజ్‌-చిరాగ్ జోడీ ఓడిపోయింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని