వార్నర్ యోధుడు: టీమ్ఇండియాకు హ్యాట్సాఫ్
టీమ్ఇండియా బౌలింగ్పై ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత బౌలింగ్ ఎంతో క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా ఉందని తెలిపారు. మూడో టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ కష్టాలకు పరిష్కారం కనుగొంటామని పేర్కొన్నారు. ‘వారియర్’ వార్నర్, విల్ పుకోవ్స్కీ జట్టులోకి రావడం ఖాయమని...
క్రమశిక్షణ, ప్రణాళికతో బౌలింగ్ చేస్తున్న భారత్: లాంగర్
సిడ్నీ: టీమ్ఇండియా బౌలింగ్పై ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత బౌలింగ్ ఎంతో క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా ఉందని తెలిపారు. మూడో టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ కష్టాలకు పరిష్కారం కనుగొంటామని పేర్కొన్నారు. ‘వారియర్’ వార్నర్, విల్ పుకోవ్స్కీ జట్టులోకి రావడం ఖాయమని వెల్లడించాడు. డిసెంబర్ 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే.
తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ తక్కువ స్కోర్ల గురించి ప్రశ్నించగా టీమ్ఇండియా అత్యంత కచ్చితత్వం, ప్రమాదకరంగా బంతులు విసురుతోందని లాంగర్ అన్నారు. ‘కొన్ని సిరీసుల నుంచి క్రమశిక్షణగా ఉండటం టీమ్ఇండియా అతిపెద్ద బలం. గత రెండు టెస్టులను నేనెంతో ఇష్టపడ్డాను. బ్యాటు, బంతి మధ్య పోరాటం ఉద్ధృతంగా సాగింది. టెస్టు క్రికెట్ అంటే ఇదే మరి’ అని ఆయన పేర్కొన్నారు. భారత బౌలర్లు స్ట్రెయిట్లైన్లో విసిరిన బంతులను ఎందుకు ఆడలేకపోతున్నారని అడగ్గా..
‘అది మేం ఆడుతున్న వికెట్లను బట్టి ఉంటుంది. ఆ పిచ్లపై సీమ్ మూమెంట్ ఉంటుంది. బంతి రెండు వైపులా స్వింగ్ అవుతుంది. టీమ్ఇండియా భిన్నంగా స్ట్రెయిట్లైన్ ఎంచుకొని ఫీల్డర్లను మోహరించి మా బ్యాటర్లకు బంతులు విసిరింది. రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా గొప్ప బౌలర్లు. అలాంటివారు పరుగులు చేయనివ్వరు. ఆస్ట్రేలియా తరహా క్రికెట్ ఆడాలని మేమూ కోరుకుంటున్నాం. కానీ టీమ్ఇండియాను అభినందించి తీరాల్సిందే. ఎంతో ప్రణాళికా బద్ధంగా, క్రమశిక్షణగా, పోటాపోటీగా బౌలింగ్ చేసింది. తొలి టెస్టు ఆడని సిరాజ్ సైతం అనుభవజ్ఞుడిలా బంతులు విసిరాడు. మూడో టెస్టులో కొత్త బౌలర్ ఎవరొస్తారో చూడాలి. భారత బౌలింగ్ సవాల్కు తప్పకుండా ప్రతివ్యూహం కనుగొంటాం’ అని లాంగర్ అన్నారు.
ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, విలియమ్ పుకోవ్స్కీ మూడో టెస్టు ఆడటం ఖాయమని లాంగర్ తెలిపాడు. మోకాలి కండరాల గాయంతో వార్నర్, కంకషన్తో పుకోవ్స్కీ తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. ‘తర్వాతి మ్యాచుకు వార్నర్ సిద్ధంగా ఉన్నాడు. అతడో యోధుడు! ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడని వచ్చిన తొలిరోజు నుంచీ చెబుతున్నాను. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బాగా ఆడాలన్న పట్టుదలతో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో పోటీని ఇష్టపడతాడు. పుకోవ్స్కీ సైతం సిద్ధంగా ఉన్నాడు. అతడు కాస్త స్టీవ్స్మిత్లా ఆడతాడు. ఈ వేసవిలో దేశవాళీ క్రికెట్ను విపరీతంగా ఆడాడు. వార్నర్ ఒక్కడే కాస్త తక్కువ ఆడాడు’ అని లాంగర్ తెలిపారు.
ఇవీ చదవండి
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్
జూలో జంతువుల్లా చేస్తారా: టీమ్ఇండియా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)