Legends League Cricket: ‘లెజెండ్స్ లీగ్’ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) టోర్నీ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్కు వేదిక ఖరారైంది. అక్టోబరు 5వ తేదీన జయ్పుర్లోని..
(ఫొటో సోర్స్: ఎల్ఎల్సీ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) టోర్నీ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్కు వేదిక ఖరారైంది. అక్టోబరు 5వ తేదీన జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా తుది పోరు జరగనుంది. ఈ మేరకు లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా వెల్లడించారు. ప్రపంచస్థాయి మాజీ క్రికెటర్లు ఆడుతోన్న లీగ్ ఫైనల్ మ్యాచ్ను చారిత్రక మైదానంలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపాడు. తొలిసారి భారత్లో జరుగుతోన్న ఎల్ఎల్సీ టోర్నమెంట్కు ప్రేక్షకాదరణ విపరీతంగా వస్తోంది. ఇప్పటికే 2 కోట్లకుపైగా ప్రత్యక్షంగా చూసిన వ్యూవర్షిప్ దాటేసింది.
‘‘సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. అందుకే లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్ను అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. విజేతగా నిలిపే ఫైనల్ మ్యాచ్కు వేదికగా కావడం గర్వకారణం. ప్రపంచంలోని ఇతర లీగ్లకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా సాగుతోంది. దిగ్గజ క్రికెటర్లు తమ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ అభిమానులు అలరిస్తున్నారు. గ్రూప్ స్టేజ్లోనూ ఎంతో ఉత్కంఠభరితంగా మ్యాచ్లు సాగగా.. ఫైనల్లోనూ అదే ఉత్సాహంతో ఆడటం ఖాయం’’ అని రహేజా వెల్లడించారు. క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లకు జోధ్పుర్ వేదికగా నిలిచింది. అక్టోబరు 2న క్వాలిఫయిర్.. అక్టోబర్ 3న ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.