Legends League Cricket: వ్యూవర్షిప్లో దూసుకుపోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో మహామహులు పోటీపడుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్కు విశేష ఆదరణ అభిస్తోంది........
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో మహామహులు పోటీపడుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్కు విశేష ఆదరణ లభిస్తోంది. భారత్లో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ వ్యూవర్షిప్లో దూసుకుపోతోంది. దేశంలోని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో 1.6 కోట్ల మందికిపైగా పైగా ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల దాటినట్లు టీవీ రేటింగ్లను తెలిపే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు ఈ లీగ్లో పాల్గొంటుండటంతో దీనికి ఇంతటి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియా మహారాజాస్ పేరుతో ఈ లీగ్లో భారత జట్టు పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ టీమ్కి, వరల్డ్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరిగిన సీజన్ ప్రారంభ మ్యాచ్కి అత్యధిక వ్యూవర్షిప్ నమోదైనట్లు బార్క్ తెలిపింది. భారత టీ20 లీగ్ మినహా దేశంలో జరిగే ఇతర క్రికెట్ లీగ్ల కంటే ఎక్కువ రేటింగ్లను సంపాదించడం విశేషం. ఈ సందర్భంగా లెజెండ్స్ లీగ్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రీడలను ప్రపంచానికి దగ్గర చేసిన స్టార్ స్పోర్ట్స్కి, ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వేదికను నిర్వాహకులు ఖరారు చేశారు. అక్టోబర్ 5న కటక్లోని బారాబతి స్టేడియంలో తుది పోరు జరగనుంది.
ఈ లీగ్లో భారత్ నుంచి వెటరన్ క్రికెటర్లు సచిన్తోపాటు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కైఫ్, గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ సహా పలువురు పాల్గొంటున్నారు. క్రిస్ గేల్, జాక్వెస్ కల్లిస్, షేన్ వాట్సన్, బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్ సహా అనేక మంది విదేశీ క్రికెటర్లు పాలుపంచుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు