Tokyo Olympics: పావురాలను అప్పుడు చంపేశారు.. ఇప్పుడు ఎగరేస్తున్నారు.. !
నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడ ఒలింపిక్స్ను ఆతిథ్య దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో పావురాలను గాల్లోకి వదిలేయడం గమనించే ఉంటారు కదా..! క్రీడలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతి చిహ్నామైన పావురాలను గాల్లోకి వదులుతారు. కానీ, ఒలింపిక్స్ తొలినాళ్లలో
ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడ ఒలింపిక్స్ను ఆతిథ్య దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో పావురాలను గాల్లోకి వదిలేయడం గమనించే ఉంటారు కదా..! క్రీడలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతికి చిహ్నమైన పావురాలను గాల్లోకి వదులుతారు. కానీ, ఒలింపిక్స్ తొలినాళ్లలో ఆ పావురాలను చంపేసే షూటింగ్ విభాగం ఒకటి ఉండేదన్న విషయం తెలుసా? ఎక్కువ సంఖ్యలో పావురాలను చంపిన వారిని విజేతలుగా ప్రకటించేవారు.
ఆధునిక ఒలింపిక్స్లో కాలనుగుణంగా ఎన్నో క్రీడలు భాగమయ్యాయి. విమర్శలు, కష్టతర నిర్వహణలతో మరికొన్ని కనుమరుగయ్యాయి. అలా ఒలింపిక్స్ క్రీడల్లో నుంచి తొలగించిన క్రీడే లైవ్ పీజియన్ షూటింగ్. ప్రస్తుతం అథ్లెట్లు ఆడుతున్న స్కీట్ షూటింగ్.. ఒకప్పటి పీజియన్ షూటింగ్ నుంచి వచ్చిందే. ఆధునిక ఒలింపిక్స్ 1896లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిసారి కాబట్టి కొన్ని క్రీడలను ఎంపిక చేసి వాటిలో పోటీ నిర్వహించారు. ఆ తర్వాత 1900లో ఫ్రాన్స్లో జరిగిన రెండో ఒలింపిక్స్లో ఈ లైవ్ పీజియన్ షూటింగ్ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో క్రీడాకారులు ఎగురుతున్న పావురాలను చంపాల్సి ఉంటుంది. అలా ఎన్ని పావురాలను చంపితే అన్ని పాయింట్లు లభిస్తాయి. ఎక్కువ పావురాలను చంపినవారు విజేతలవుతారు.
లైవ్ పీజియన్ షూటింగ్లో సెంటెనరీ గ్రాండ్ ప్రైజ్.. 1900 వరల్డ్ ఎక్స్పో గ్రాండ్ ప్రైజ్ రెండు రకాల పోటీలు ఉండేవి. సెంటెనరీ గ్రాండ్ ప్రైజ్ 1900 జూన్ 19న నిర్వహించారు. అందులో 166 మంది పాల్గొన్నారు. 1900 వరల్డ్ ఎక్స్పో గ్రాండ్ ప్రైజ్ జూన్ 25, 26, 27తేదీల్లో నిర్వహించగా.. 54 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
అథ్లెట్కు 27 మీటర్ల దూరంలో నిర్వాహకులు పావురాలను గాల్లోకి ఎగరేసేవారు. నిర్ణీత సమయంలో ఆ పావురాలను తుపాకీ గురి పెట్టి చంపాలి. తొలి ఆరు పావురాల్లో రెండింటిని మిస్ చేస్తే ఆ క్రీడాకారులు పోటీ నుంచి ఎలిమినేట్ అవుతాడు. అలా ఈ ఆటలో దాదాపు 300 పావురాలు బలయ్యాయి. ఈ పోటీల్లో సెంటెనరీ గ్రాండ్ ప్రైజ్ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ మ్యాకింతోష్ 22 పావురాలను చంపి అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో నిలిచిన స్పెయిన్ అథ్లెట్ 21 పావురాలను, మూడోస్థానంలో నిలిచిన యూఎస్ఏ అథ్లెట్ 19 పావురాలను చంపారు. ఇక 1900 వరల్డ్ ఎక్స్పో గ్రాండ్ ప్రైజ్ విభాగంలో బెల్జియం అథ్లెట్ 21పావురాలని చంపి విజేతగా నిలవగా.. ఫ్రాన్స్ అథ్లెట్ 20, ఆస్ట్రేలియా అథ్లెట్ 18, యూఎస్ఏ అథ్లెట్ 18 పావురాలను చంపి వరుసగా 2,3,4 స్థానాలు దక్కించుకున్నారు. అయితే, విజేతలకు ఇచ్చిన 20వేల ఫ్రాంక్స్ను టాప్ 4 అథ్లెట్లు పంచుకున్నారు.
అయితే, క్రీడల కోసం ప్రాణుల్ని బలిచేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ఒలింపిక్స్ కమిటీ ఆ తర్వాత నుంచి ఈ క్రీడను నిలిపివేయాలని నిర్ణయించింది. అలా ఆ ఒక్క ఒలింపిక్స్లోనే పావురాలను చంపే క్రీడ ఉంది. ఆ తర్వాత నుంచి పావురాలకు బదులుగా.. రంగులు నింపిన బాల్స్ను ఉపయోగిస్తూ స్కీట్ షూటింగ్ను నిర్వహిస్తున్నారు.
జింకలను చంపడమూ ఆటే
1908 నుంచి 1924 మధ్య ఒలింపిక్స్లో 100 మీటర్స్ రన్నింగ్ డీర్ పోటీలు నిర్వహించారు. 100 మీటర్ల పిచ్పై జింక పరుగెడుతుంటే.. అథ్లెట్ నిర్ణీత దూరం నుంచి తుపాకీతో జింకను కాల్చాల్సి ఉంటుంది. సింగిల్ అండ్ డబుల్ షాట్ విభాగాలుగా ఈ క్రీడ ఉండేది. ఆ తర్వాత 1952, 1956 ఒలింపిక్స్లోనూ ఈ ఆటను నిర్వహించారు. అనంతరం ఆటకు స్వస్తి చెప్పారు. కేవలం ఒలింపిక్స్లోనే కాదు.. ప్రపంచ షూటింగ్ పోటీల్లోనూ రన్నింగ్ డీర్ పోటీలు నిర్వహించేవారు. కాలక్రమంలో ఆ ఆటే ప్రస్తుతం 100మీటర్ల షూటింగ్ విభాగంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్