IPL 2023: హార్దిక్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా: జాషువా లిటిల్
ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్ సంచలనం సృష్టించాడు. ఆ దేశం నుంచి ఐపీఎల్ (ipl) లోకి అడుగు పెట్టిన తొలి బౌలర్గా మారాడు. గుజరాత్ టైటాన్స్ (gt) లిటిల్ను ఐపీఎల్ మినీ వేలంలో సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (ipl)లోకి అడుగుపెట్టిన మొదటి ఐర్లాండ్ క్రికెటర్గా జాషువా లిటిల్ నిలిచాడు. ఈ 23 ఏళ్ల ఆటగాడిని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. లిటిల్ గతేడాది టీ20 లీగ్లో చెన్నై జట్టుకు నెట్ బౌలర్గా సేవలందించాడు. ఇటువంటి అత్యుత్తమ టీ20 లీగ్లో ఆడటం అద్భుత అవకాశామని లాభదాయకమైన టీ20 లీగ్లో ఆడటం ఒక అద్భుతమైన అవకాశమని ఐర్లాండ్ పేసర్ లిటిల్ అభివర్ణించాడు. కోచ్ ఆశిష్ నెహ్రా - కెప్టెన్ హార్దిక్ పాండ్య నాయకత్వంలో గుజరాత్ తరఫున ఆడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని లిటిల్ తెలిపాడు. ‘‘డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జట్టుతో సంతకం చేసినందుకు సంతోషంగా ఉంది. కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలో హార్దిక్ సారథ్యంలో ఒక బలమైన జట్టుతో కలిసి ఆడటానికి ఎదురుచూస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు గుజరాత్ ఫ్రాంచైజీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
జాషువా లిటిల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 22 వన్డేలు, 53 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్లో అడిలైడ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్, ఐర్లాండ్ మ్యాచ్లో లిటిల్ అద్భుతమైన హ్యాట్రిక్ సాధించాడు. 19వ ఓవర్లో వరుసగా కెప్టెన్ కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ను ఔట్ చేశాడు. లిటిల్ అనేక ఫ్రాంచైజీ లీగ్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ది హండ్రెడ్, లంక లీగ్ (ఎల్పీఎల్)లో ఆడాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్లోనూ స్థానం సంపాదించాడు. ‘‘ఐర్లాండ్ క్రికెట్లో లిటిల్ కొన్ని సంవత్సరాలుగా కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా అతడు కచ్చితంగా పురోగతి సాధించగలడు’’ అని ఐర్లాండ్ క్రికెట్ డైరెక్టర్ రిచర్డ్ హోల్డ్స్వర్త్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్