Michael Vaughan: కోహ్లీసేనను రక్షించేందుకే వర్షం వచ్చిందంట! వాన్ వెటకారం!!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ టీమ్ఇండియాపై సెటైర్లు వేయడం ఇంకా మానుకోలేదు! ఇంగ్లాండ్తో తొలి టెస్టు వర్షంతో నిలిచిపోయిన సందర్భంలోనూ అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కోహ్లీసేనను రక్షించేందుకే వరుణుడు వచ్చాడట!..
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ టీమ్ఇండియాపై సెటైర్లు వేయడం ఇంకా మానుకోలేదు! ఇంగ్లాండ్తో తొలి టెస్టు వర్షంతో నిలిచిపోయిన సందర్భంలోనూ అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కోహ్లీసేనను రక్షించేందుకే వరుణుడు వచ్చాడట! అని.
ఆంగ్లేయులపై తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసే అవకాశం టీమ్ఇండియాకు త్రుటిలో చేజారింది. ఆట ఆఖరి రోజు వర్షం రావడమే ఇందుకు కారణం. ఈ పోరులో తొలుత బ్యాటింగ్కు దిగిన జో రూట్ సేనను కోహ్లీసేన దెబ్బకొట్టింది. జస్ప్రీత్ బుమ్రా (4/46), మహ్మద్ షమి (3/28) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (56) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 278 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్ను 98 పరుగుల లోటుతో ఆరంభించిన ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (109) శతకం చేయడంతో ఫర్వాలేదనిపించింది. 205 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 52/1తో నిలిచింది. ఆఖరి రోజు 150 పైచిలుకు పరుగులు చేయడం కోహ్లీసేనకు కష్టమేం కాదు. అలాంటి సమయంలో రోజంతా వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది.
భారత్ గెలుపు అవకాశాలను వరుణుడు దెబ్బకొట్టడంతో మైకేల్ వాన్ సెటైర్ వేశాడు. ‘చూస్తుంటే ఇక్కడ భారతీయులను వర్షం రక్షిస్తున్నట్టు ఉంది..’ అని ట్వీట్ చేశాడు. పరోక్షంగా ఇది ఆంగ్లేయులను ఉద్దేశించి చేసిందే అయినా భారత జట్టుపై అతడు విసిరే వ్యంగ్య ట్వీట్ల గురించి మనకు తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా