Mega Auction : మెగా వేలం.. కొత్త ఫ్రాంచైజీల వల ఎవరికో..?
మెగా వేలం సందడి షురూ అయింది. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 టోర్నీ మెగా వేలం సందడి షురూ అయింది. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొంటున్నా.. ప్రస్తుతం అందరి చూపు కొత్త టీమ్లపైనే ఉంది. ఇప్పటికే ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవడం పూర్తైంది. కోచ్తోపాటు సహాయక సిబ్బందిని నియమించుకోవడమూ జరిగింది. ఇక కొత్త ఆటగాళ్ల ఎంపికపై జట్లు దృష్టిసారించాయి. మరి లక్నవూ, అహ్మదాబాద్ జట్లు ఎవరిని తీసుకునేందుకు మొగ్గు చూపొచ్చనే విషయాలను ఓసారి పరిశీలిద్దామా..
లఖ్నవూ
పంజాబ్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్ రాహుల్ను కొత్త ఫ్రాంచైజీ లఖ్నవూ తమ కెప్టెన్గా నియమించుకుంది. రాహుల్ కోసం రూ. 17 కోట్లను వెచ్చించడం విశేషం. ప్రధాన కోచ్గా ఆండీ ఫ్లవర్, మెంటార్గా గౌతమ్ గంభీర్ వ్యవహరించనున్నారు. అలానే రాహుల్తోపాటు ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ (రూ. 9.2 కోట్లు), కొత్త కుర్రాడు రవి బిష్ణోయ్ (రూ.4 కోట్లు)ను ఎంపిక చేసుకుంది. మెగా వేలంలో మిగతావారిని కొనుగోలు చేసుకునేందుకు రూ. 59 కోట్లు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఐదుగురి మీద భారీ మొత్తం పెట్టేందుకు వెనుకాడకపోవచ్చు.
* డేవిడ్ వార్నర్ : ఈ లెఫ్ట్ఆర్మ్ ఓపెనర్ క్రీజ్లో కుదురుకుంటే భయంకరంగా ఆడతాడు. హైదరాబాద్ రిటెయిన్ చేసుకోకపోవడంతో వార్నర్ మెగా వేలంలోకి వచ్చాడు. కోట్లు కుమ్మరించడానికి మిగతా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉన్న ఆటగాళ్లలో వార్నర్ ప్రథముడే అని చెప్పాలి.
* క్వింటన్ డికాక్/ సురేశ్ రైనా: వీరిద్దరిలో ఒకరిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది. ముంబయి తరఫున క్వింటన్ డికాక్ చాలా కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే క్వింటన్ వైపు ముంబయి మొగ్గు చూపితే వేలం రసవత్తరంగా మారొచ్చు. అలానే సురేశ్ రైనా కూడా మంచి హిట్టరే. కాకపోతే గత సీజన్ల ఫామ్ను చూస్తే కొంచె కష్టమే అయినా.. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
* మహమ్మద్ షమీ / అవేశ్ ఖాన్: ఇక బౌలర్ల విషయానికొస్తే.. గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని తీసుకోవడానికి కేఎల్ రాహుల్ మొగ్గు చూపే ఆస్కారం ఉంది. తన పంజాబ్ సహచరుడు కావడం కూడా కలిసొచ్చే అంశం. ఇప్పటికే మార్కస్ స్టొయినిస్ రూపంలో మీడియం పేసర్ ఉన్నాడు. అతడికి తోడుగా యువ బౌలర్ అవేశ్ ఖాన్ను దక్కించుకోవడానికి లఖ్నవూ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు భువనేశ్వర్ కుమార్, శివమ్ మావి, కార్తిక్ త్యాగిలలో ఒకరిని తీసుకోవాలని లఖ్నవూ భావిస్తున్నట్లు సమాచారం.
గుజరాత్ టైటాన్స్
కొత్త ఫ్రాంచైజీల్లో గుజరాత్ ఒకటి. ప్రధాన కోచ్గా టీమ్ఇండియా మాజీ ఫాస్ట్బౌలర్ ఆశిష్ నెహ్రా, మెంటార్, బ్యాటింగ్ కోచ్గా గ్యారీ కిర్స్టెన్, డైరెక్టర్గా విక్రమ్ సోలంకీ వ్యవహరిస్తారు. గుజరాత్కు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తాడు. పాండ్యతోపాటు రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను ఫ్రాంచైజీ తీసుకుంది. ఇంకా మిగతా ఆటగాళ్ల కోసం రూ.52 కోట్లను వెచ్చించనుంది.
* డుప్లెసిస్: గత సీజన్లో చెన్నె టైటిల్ నెగ్గడంలో ఓపెనర్ డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే డుప్లెసిస్ను చెన్నై రిటెయిన్ చేసుకోలేదు. దీంతో ఫామ్లో ఉన్న డుప్లెసిస్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం ఖాయం. గుజరాత్ కూడా మంచి ఓపెనర్ స్థానం కోసం డుప్లెసిస్ను దక్కించుకోవాలని ఎదురు చూస్తోంది.
* శ్రేయస్ అయ్యర్: మెగా వేలంలో డేవిడ్ వార్నర్ తర్వాత శ్రేయస్ అయ్యర్పైనే అందరి గురి. మిడిలార్డర్లో నిలకడగా ఆడే అయ్యర్ 13వ సీజన్లో దిల్లీని సారథిగా ఫైనల్కు చేర్చిన అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలో గుజరాత్ కన్ను శ్రేయస్ మీద ఉండటం సహజమే. అయితే భారీ మొత్తం దక్కించుకునే వారిలో శ్రేయస్ ఒకడు కాబట్టి గుజరాత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
* షకిబ్ అల్ హసన్: సూపర్ ఆల్రౌండర్. ఇటు బౌలింగ్, బ్యాటింగ్లోనూ రాణించగల అనుభవశాలి. బంగ్లా అత్యుత్తమ ఆటగాళ్లలో షకిబ్ ఒకడు. కీలక సమయాల్లో అవసరమైన పరుగులు చేయగలడు. వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలడు. ఇప్పటికే హార్దిక్ పాండ్య వంటి ఆల్రౌండర్కు మరొకరు తోడైతే గుజరాత్ పటిష్ఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.
* రవిచంద్రన్ అశ్విన్: టీమ్ఇండియా సీనియర్ ఆల్రౌండర్ అశ్విన్. టాప్ ఆఫ్ స్పిన్నర్గా రాటుదేలాడు. ఇటీవల బ్యాటింగ్లోనూ ఫర్వాలేదనిపించాడు. మరోసారి దిల్లీ అశ్విన్ను దక్కించుకోవడానికి ముందుకు రావచ్చు. అదే క్రమంలో చెన్నై కూడానూ అశ్విన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు