LSG vs MI: లఖ్నవూ సూపర్ జెయింట్స్ కొంప ముంచిన రనౌట్లు!
లఖ్నవూ సూపర్ జెయింట్స్ను ఓడించడంలో ముంబయి (LSG vs MI) ఆల్రౌండ్ ప్రదర్శనతోపాటు మరొక అంశం కీలక పాత్ర పోషించింది. అదే ముగ్గురు బ్యాటర్లు రనౌట్లు కావడం. ఇవే లఖ్నవూ ఓటమిని ఖరారు చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ విజయానికి ఆకాశ్ మధ్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన ఒక కారణం అయితే.. రనౌట్లు మరో కారణం అని చెప్పాలి. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో మొత్తంగా మూడు రనౌట్లు నమోదయ్యాయి. ఈ కారణంగానే ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉన్న లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG) 101 పరుగులకే అలౌటైంది. అయితే ఇదంతా లఖ్నవూ బ్యాటర్ల స్వయం కృతాపరాధం అనొచ్చు. కీలక సమయంలో వికెట్లు ఇచ్చేయడంతోపాటు.. అనవసర పరుగులకు పోయి రనౌట్లు అయ్యారు. ఆ రనౌట్లు జరిగాయిలా...
- కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో (11.5వ ఓవర్) మార్కస్ స్టాయినిస్ డీప్ మికెట్ మీదుగా బంతిని కొట్టాడు. దీపక్ హుడాతో కలిసి మార్కస్ స్టాయినిస్ తొలి పరుగును సునాయాసంగా తీశాడు. రెండో పరుగు కూడా ఈజీగానే వచ్చేది. కానీ, పరుగెత్తే క్రమంలో ఒకరినొకరు ఢీకొనడంతో స్టాయినిస్ నెమ్మదించాడు. అప్పటికే టిమ్ డేవిడ్ కీపర్ వైపు బంతిని విసరగా.. ఇషాన్ కిషన్ అమాంతం వికెట్లను గిరాటేశాడు.
- స్టాయినిస్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కృష్ణప్ప గౌతమ్ (2) అనవసర పరుగుకు యత్నించి పెవిలియన్కు చేరాడు. చావ్లా బౌలింగ్లో (12.3వ ఓవర్) గౌతమ్ బ్యాక్వర్డ్ పాయింట్ వైపుగా బంతిని కొట్టాడు. అక్కడ గ్రీన్ అద్భుతంగా ఆపాడు. ఇక్కడే చిన్న డ్రామా జరిగింది. గ్రీన్ ఆ బంతిని కవర్స్లో ఉన్న రోహిత్ వైపు నెట్టాడు. మిస్ ఫీల్డ్ అనుకుని గౌతమ్ పరుగు కోసం ముందుకు వచ్చాడు. కానీ, నాన్ స్ట్రయికర్ దీపక్ హుడా ఆసక్తి చూపింకచపోవడంతో వెనక్కి వెళ్లాడు. అయితే, ఈలోపు గ్రీన్ నుంచి బంతిని అందుకున్న రోహిత్ డైరెక్ట్గా వికెట్ల మీదకు విసరడంతో గౌతమ్ ఔటవ్వక తప్పలేదు.
- పై రెండు రనౌట్లలో భాగస్వామి అయిన దీపక్ హుడా కూడా రనౌట్గానే పెవిలియన్కు చేరడం గమనార్హం. ఆకాశ్ మధ్వాల్ వేసిన (14.5వ ఓవర్) బంతిని నవీనుల్ హక్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. కామెరూన్ గ్రీన్ అద్భుతంగా బంతిని ఆపాడు. నాన్ స్ట్రయికింగ్లో ఉన్న దీపక్ హుడా స్ట్రయికర్ ఎండ్ వైపు వచ్చేశాడు. ఈలోపు నవీనుల్ హక్ కాస్త ముందుకొచ్చి తిరిగి క్రీజ్లోకి వెళ్లిపోయాడు. ఈ సమయంలో గ్రీన్ విసిరిన బంతిని బౌలర్ మధ్వాల్ అందుకొని నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు ఉన్న రోహిత్కు అందించాడు. హిట్ మ్యాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వికెట్లను పడగొట్టడంతో దీపక్ హుడా నిరాశగా పెవిలియన్కు చేరాడు.
ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 183 పరుగులను లఖ్నవూకు లక్ష్యంగా నిర్దేశించింది. కీలక సమయంలో వికెట్లు పడినప్పటికీ.. క్రీజ్లో స్టాయినిస్ (40), దీపక్ హుడా (15) ఉండటంతో లఖ్నవూ విజయంపై నమ్మకంగానే ఉంది. చివరి పది ఓవర్లలో 108 పరుగులు చేయాల్సి ఉన్నా లఖ్నవూ బెదరలేదు. కానీ రనౌట్లు లఖ్నవూ కోలుకోనీయకుండా చేశాయి. దీంతో 81 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అలా రెండో క్వాలిఫయర్కి వెళ్దాం అనుకున్న లఖ్నవూ ఆశలు ఆవిరైపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి