Ravichandran Ashwin : అతడిని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశాను : అశ్విన్
టీమ్ఇండియా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బయట పెట్టాడు. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ని ఔట్ చేసేందుకు ఆరు నెలలు
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బయట పెట్టాడు. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశానని పేర్కొన్నాడు. టీమ్ఇండియా గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలిసారిగా టెస్టు సిరీస్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అశ్విన్ ఇటీవల ఓ క్రీడా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
‘ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆరు నెలలుగా స్టీవ్ స్మిత్ పైనే పూర్తిగా దృష్టి సారించాను. అంతకు ముందు అతడు ఆడిన మ్యాచుల ఫుటేజీలు చూసి.. బ్యాటింగ్ శైలిని గమనించాను. అతడి ఆలోచన విధానాన్ని, బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. స్మిత్ బ్యాటింగ్ ఎక్కువగా హ్యాండ్ మూవ్మెంట్పైనే ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయగలిగితే పై చేయి సాధించినట్లే. ఈ ట్రిక్ ఆధారంగానే వైవిధ్యమైన బంతులేసి అతడిని ఔట్ చేయగలిగాను. అలాగే, ఆసీస్కి చెందిన మరో ఆటగాడు మార్నస్ లబూషేన్ని ఔట్ చేసేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు రచించాను. ఫీల్డ్లో వాటిని అమలు చేసి ఫలితం రాబట్టాను’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
* కపిల్ దేవ్ రికార్డుకు చేరువైన అశ్విన్
ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (427 వికెట్లు) తాజాగా మరో రికార్డుకు చేరువయ్యాడు. మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ (434 వికెట్లు) రికార్డుకు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్లో ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బద్దలు కొడితే.. టెస్టు ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నాడు. భారత్ తరఫున మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్